గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఆ విమానంలో ప్రయాణించిన వారిలో ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయనే రమేశ్ విశ్వాస్ కుమార్. అయితే తాజాగా ఈయనకు సంబంధించి మరో సంచలన వీడియో బయటపడింది. విమాన ప్రమాదం జరిగాక భారీ పొగలు, మంటల్లోంచి విశ్వాస్ కుమార్ నడుచుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈ కొత్త వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలాఉండగా ఇటీవల అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి ఎయిరిండియా ఫ్లైట్ లండన్కు బయలుదేరింది. విమానం రన్వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మేఘాని నగర్లో కుప్పకూలింది. ఈ విమానం బీజే మెడికల్ కాలేజీపై కూలడంతో అందులో ఉన్న పలువురు వైద్య విద్యార్థులు, వైద్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మొత్తం 270 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఈ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read: గొంతు కోసి.. కాలువలో పడేసి.. మోడల్ దారుణ హత్య!
ఈ దుర్ఘటనలో మృతి చెందిన వాళ్లని గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రక్రియ గత మూడు రోజులుగా సాగుతోంది. ఇప్పటిదాకా డీఎన్ఏ పరీక్షల ద్వారా 87 మృతదేహాలు గుర్తింపు అధికారులు తెలిపారు. మృతుల్లో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినవాళ్లే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.