/rtv/media/media_files/2025/06/16/njgviiwke2dz8Swdg4yX.jpg)
Iran Israel Conflict : ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ రణరంగంగా మారుతోంది. బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. ఎడతెరపి లేని సైరన్ల మోతతో ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. ఈ క్రమంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని భారతీయ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉండలేని పరిస్థితులున్నాయని, తమను స్వదేశానికి తీసుకెళ్లాలని భారత ప్రభుత్వాన్ని వారు వేడుకుంటున్నారు.
ఇరన్లో పరిస్థితులు ఏ మాత్రం భాగలేవని నిత్యం బాంబుల మోతతో రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.మేముంటున్న ప్రాంతానికి సమీపంలోనే బాంబులు పేలినట్లు తెలిసింది. అప్పటి నుంచి మాకు నిద్రలేని రాత్రులే మిగిలయాని వారు వాపోతున్నారు. టెహ్రాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇక్కడి షాహిద్ యూనివర్సిటీలో సుమారు 350 మంది వైద్య విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఒక్క విశ్వవిద్యాలయంలోనే ఇంతమంది భారతీయ విద్యార్థులుంటే ఇంకా ఇతర యూనివర్సిటీలలో వందలాది మంది విద్యార్థులు ఉంటారని తెలుస్తోంది.
Also Read: దుబాయ్లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం
కాగా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో భారత ఎంబసీ అప్రమత్తమైంది. అక్కడి విద్యార్థులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తోంది. కానీ విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమనిగడుపుతున్నారు. వీలయినంత త్వరగా స్వదేశానికి రావాలని వారు కోరుకుంటున్నారు. పరిస్థితి మరింత చేయిదాటక ముందే తమను తరలించాలని కోరుతున్నారు.
Also Read: Kuberaa Trailer: 'కుబేరా' ట్రైలర్ లో ఇదే హైలైట్.. ధనుష్- నాగ్ కాంబో అదిరింది!
\మరోవైపు ఈ విషయమై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో టెహ్రాన్లో భారత ఎంబసీ నిరంతరం గమనిస్తుందని అధికారులు వెల్లడించారు.
అక్కడి భారతీయ విద్యార్థుల భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్రిక్తత ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కొంతమంది విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించామన్నారు. మిగతా వారి పరిస్థితిని కూడా ఎంబసీ అధికారులు పరిశీలిస్తున్నారు. కమ్యూనిటీ నాయకులతోనూ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం, అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని’ అని విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా విద్యార్థులను తరలించడానికి టెహ్రాన్ కూడా అంగీకరించిందని, గగనతలం మూసివేసినందున భూ సరిహద్దుల ద్వారా వారిని తీసుకెళ్లవచ్చని ఇరాన్ విదేశాంగా శాఖ వెల్లడించింది.