ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్పై ఇండియన్ ఆర్మీ వైమానిక దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రధాని మోదీ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశం అయ్యారు. పాకిస్థాన్, POKలో ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ చేపట్టిన దాడుల గురించి ఆమెకు వివరించారు. ఇదిలాఉండగా కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చింది. గురువారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది.
Also Read: వెన్నులో వణుకుపుట్టించే ఆపరేషన్ సిందూర్ లైవ్ వీడియోస్.. చూస్తే గజగజ!
ఆపరేషన్ సిందూర్ తదనంతరం తీసుకునే చర్యల గురించి ఆయా పార్టీల నేతలకు కేంద్రం వివరించనుంది. అలాగే దేశభద్రతకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు తదితరులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పాకిస్థాన్పై చేపట్టిన మెరుపుదాడులను విపక్ష పార్టీల నేతలు కూడా స్వాగతించారు. పాక్ ఉగ్రచర్యలకు వ్యతిరేకంగా భారత్ తీసుకునే నిర్ణయాలకు తాము సపోర్ట్ చేస్తామన్నారు.
Also Read: ఎవరీ మసూద్ అజార్.. జైషే మహ్మద్ మాస్టర్ మైండ్ రహస్యాలివే..!
మరోవైపు ఆపరేషన్ సిందూర్ జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు CWC భేటీ నిర్వహించనుంది. ప్రస్తుతం ఉన్న పరిణామాలపై కాంగ్రెస్ నేతలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, డీజీపీలు ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి మీటింగ్ నిర్వహించనున్నారు. జమ్మూకశ్మీర్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, సిక్కిం,పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు హాజరుకానున్నారు.
Also Read: 'పాక్ను ఓడించండి' అన్నందుకు కత్తితో దాడి.. బాలుడిని దారుణంగా పొడిచి!
rtv-news | national-news | operation Sindoor | operation sindoor air strike | pm modi | draupadi murmu