Operation Sindoor: 'పాక్‌ను ఓడించండి' అన్నందుకు కత్తితో దాడి.. బాలుడిని దారుణంగా పొడిచి!

యూపీ షాజహాన్‌పూర్‌లో ఘోరం జరిగింది. ఆపరేషన్ సిందూర్ అటాక్ నేపథ్యంలో 'పాకిస్తాన్‌ను ఓడించండి' అని నినాదాలు చేసిన 8ఏళ్ల సుర్జీత్‌ను మోహిద్ ఖాన్ కత్తితో పొడిచాడు. బాలుడి పరిస్థితి విషయమంగా ఉండగా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

New Update
up crime

Operation Sindoor effect young boy attacks on child with knife

Operation Sindoor: యూపీ షాజహాన్‌పూర్‌లో ఘోరం జరిగింది. ఆపరేషన్ సిందూర్ అటాక్ నేపథ్యంలో 'పాకిస్తాన్‌ను ఓడించండి' అని నినాదాలు చేసిన 8ఏళ్ల సుర్జీత్‌ను మోహిద్ ఖాన్ కత్తితో పొడిచాడు. బాలుడి పరిస్థితి విషయమంగా ఉండగా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 

పాక్ ముర్దాబాద్ అన్నందుకే..

పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ లో భాగంగా 25 నిమిషాల్లో పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. భారత సైన్యం ఆపరేషన్ సక్సెస్ కావడంతో దేశవ్యాప్తంగా పటాకులు పేల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో 'పాకిస్తాన్‌ను ఓడించండి. పాకిస్తాన్ ముర్దాబాద్' అంటూ ఓ స్థానిక బాలుడు 8 ఏళ్ల సుర్జీత్ నినాదాలు చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఓ ముస్లిం యువకుడు మోహిద్ ఖాన్, అతని స్నేహితుడు వసీంతో కలిసి సుర్జీత్ పై దాడి చేశాడు. కోపంతో బాలుడిని కత్తితో పొడిచాడు.

Also Read: యావత్ దేశానికే గర్వకారణం.. ఆపరేషన్ సిందూర్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్!

స్థానికులు గుర్తించి చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పట్టకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. మోహిద్ ఖాన్, వసీంలపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. మైనర్ సుర్జీత్ ధరమ్‌గడపూర్ గ్రామ నివాసి, నిందితుడు మోహిద్ ఖాన్ కాట్రా బజార్ పోలీస్ స్టేషన్ నిగోహి నివాసి, వసీం ఖాన్ నిగోహి రోడ్ పువయ్య నివాసిగా పోలీసులు గుర్తించారు. 

Also Read: 11, 12, 14 ఈ నెంబర్లకు ఆపరేషన్ సిందూర్‌కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?

inida | pakistan | uttara-pradesh | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు