/rtv/media/media_files/2025/04/22/rnGBcG7UyyvnJ4lz0vj5.jpg)
Jagdeep dhankar
ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించలేదని ఇటీవల ఆయన చెప్పడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరోసారి ఈ అంశంపై స్పందించారు. రాజ్యాంగపరమైన అంశాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులే 'అల్టిమేట్ మాస్టర్స్' అని అన్నారు. మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Also Read: గూగుల్ లో వెతికి మరి చంపేసింది.. మాజీ డీజీపీ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!
Jagdeep Dhankar
'' ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఎమర్జెన్సీ విధించిన ప్రధానమంత్రి అయిన సరే. ప్రజాస్వామ్యం అనేది ప్రజలకు రక్షణ ఇచ్చేందుకే ఉంది. రాజ్యాంగపరమైన అంశాల్లో ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్. పార్లమెంట్ కంటే అత్యుత్తమమైనది ఉందని రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు. పార్లమెంటే సుప్రీం'' అని జగదీప్ ధన్ఖడ్ అన్నారు. అలాగే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని తెలిపారు.
Also Read: మీ నాన్న లాగే నిన్ను కూడా చంపేస్తాం..బాబా సిద్ధిఖీ కుమారుడికి బెదిరింపులు!
ఇదిలాఉండగా రాష్ట్ర గవర్నర్ పంపిన బిల్లులకు.. నిర్ణీత గడువులోపు రాష్ట్రపతి సమ్మతి తెలపాలని సుప్రీంకోర్టు గడువు నిర్ణయిస్తూ ఇటీవల తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై జగదీప్ ధన్ఖడ్ స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..'' రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా కోర్టు వ్యవహరించడం సరికాదు. శాసననాలు చేసే జడ్జీలు మనకు ఉన్నారు. కార్యనిర్వాహక విధులు కూడా వారే చేస్తారు. సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తారు. కానీ వాళ్లకి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. దీనికి కారణం వాళ్లకి దేశ చట్టాలు అనేవి వర్తించవని'' జగదీప్ ధన్ఖడ్ అన్నారు.
Also Read: రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం.. ఆ దేశంతో చర్చలకు సిద్ధం
Also Read: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..
telugu-news | rtv-news | jagdeep-dhankhar | national-news | latest-telugu-news