/rtv/media/media_files/2025/05/07/ZY0jLVjZM0WXrCNAHI2z.jpg)
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేసింది. మంగళవారం అర్థరాత్రి తర్వాత.. బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్ గాఢనిద్రలో ఉన్న టైంలో సరిగ్గా 1.44 గంటలకు 9 స్థావరాలపై దాడులు చేసింది. పాక్తో పాటుగా పీఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను మట్టు బెట్టింది.
ఇది కూడా చూడండి: Operation Sindoor : పాక్పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ
ఈ వ్యవహారమంతా కేవలం 23 నిమిషాల్లోనే జరిగిపోయింది. ఈ దాడులతో పాక్ కు వెన్నులో వణుకు పుట్టింది. ఈ దాడుల్లో దాదాపు 90 మందికి పైగా స్పాట్లో మరణించినట్లు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా ఉగ్రవాద సంస్థ జైషే నాయకుడు, అజార్ మసూద్తో పాటు అతని కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఉగ్రదాడిలో అతని కుటుంబానికి చెందిన 14 మంది సభ్యులు మృతి చెందారు.
ఇది కూడా చూడండి: భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే.. లష్కరే తోయిబా కంచుకోట ఖతం!
మమల్ని క్షమించండి
దీంతో తమ దేశంపై యుద్దం ఆపేయమని పాక్కు చెందిన పలువురు వేడుకుంటున్నారు. అందులో పాకిస్తానీ టీవీ యాంకర్ ఒకరు. ఆపరేషన్ సిందూర్ దాడులతో పాకిస్తాన్ అతలాకుతలం అవడంతో పాకిస్తానీ టీవీ మహిళా యాంకర్ కన్నీరు పెట్టుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. తమను క్షమించండి అంటూ ఆ వీడియోలో ఏడుస్తూ కోరుతోంది.
Pakistani news anchor breaks down on live TV after India's Operation Sindoor, prays for affected 'poor souls'#OperationSindoor #OpSindoor #IndiaPakistanTensions pic.twitter.com/g0p6icu8Ka
— Webdunia English (@WDEng_Portal) May 7, 2025
ఇది కూడా చూడండి: పాక్ దాడి.. ముగ్గురు భారత పౌరులు మృతి!
అమాయకులను చంపేస్తున్నారని.. దేవుడా నువ్వే కాపాడు అంటూ కన్నీరు పెట్టుకుంది. అమాయకులంతా వీర మరణం పొందుతున్నారని.. ఈ దాడిలో చనిపోయిన వారి కుటుంబాల నుంచి తాను ఒక్కటే కోరుకుంటున్నాని తెలిపింది. చనిపోయిన ఆప్తులు ఆ దేవుడి వద్దకు వెళ్లి మా గురించి ఫిర్యాదు చేయవద్దని చెప్పండని వేడుకుంది.
ఇది కూడా చూడండి: పాక్ పై భారత్ మెరుపు దాడి.. 30కి పైగా ఉగ్రవాదులు హతం!
మేము మానవులంతా ఒక్కటేనన్న విషయాన్ని మరచిపోయామని.. మా లాంటి అవినీతి మనస్తత్వం కలిగిన వారిని క్షమించమని ప్రార్థించండి అంటూ ఆమె ఆ వీడియోలో ఏడుస్తూ వేడుకుంది. దీంతో ఆమె వీడియో వైరల్ కావడంతో చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఉగ్రవాదులు చనిపోతే ఎందుకు ఏడుస్తున్నారంటూ ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వమే కాకుండా మీడియా కూడా ఉగ్రవాదులకు తొత్తులేనని కామెంట్లు చేస్తున్నారు. భారతదేశ అమాయకులు 26 మంది చనిపోతే.. మీకెందుకు ఏడుపు రాలేదు అని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
operation Sindoor | operation sindoor latest | latest-telugu-news | telugu-news