/rtv/media/media_files/2025/05/07/Z3McBn46gK2uoB8JMTAW.jpg)
Jaish headquarters
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధాన చర్య తీసుకుంటూ మే 07వ తేదీ బుధవారం రాత్రి 1.30 గంటలకు 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడి చేసింది. ఈ దాడికి 'ఆపరేషన్ సిందూర్' అని పేరు పెట్టారు. భారత ఆర్మీ.. పాకిస్తాన్లోని 4 ప్రదేశాలను, పీఓకేలోని 5 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతోంది.అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ లోపు ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను భారత్ టార్గెట్ చేసింది.
9 ప్రాంతాలివే
1. బహవల్పూర్ - అంతర్జాతీయ సరిహద్దు నుండి 100 కి.మీ దూరంలో ఉన్న ఇది జైష్-ఎ-మహ్మద్ ప్రధాన కార్యాలయం, దీనిని భారత దళాలు కూల్చివేసాయి.
2. మురిడ్కే - ఈ ఉగ్రవాద స్థావరం అంతర్జాతీయ సరిహద్దు నుండి 30 కి.మీ దూరంలో ఉంది. 26/11 ముంబై దాడులతో సంబంధం ఉన్న లష్కరే తోయిబా శిబిరం అది.
3. గుల్పూర్ - ఈ ఉగ్రవాద స్థావరం ఎల్ఓసీ (పూంచ్-రాజౌరి) నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.
4. లష్కర్ క్యాంప్ సవాయి - ఈ ఉగ్రవాద స్థావరం POK తంగ్ధర్ సెక్టార్ లోపల 30 కి.మీ దూరంలో ఉంది.
5. బిలాల్ క్యాంప్ - జైష్-ఎ-మొహమ్మద్ లాంచ్ప్యాడ్, ఈ రహస్య స్థావరం ఉగ్రవాదులను సరిహద్దు దాటించడానికి ఉపయోగించబడింది.
6. కోట్లి – లష్కర్ శిబిరం ఎల్ఓసీ నుండి 15 కి.మీ దూరంలో ఉంది. ఇది 50 మందికి పైగా ఉగ్రవాదులకు వసతి కల్పించే సామర్థ్యం ఉన్న రహస్య స్థావరం.
7. బర్నాలా క్యాంప్ – ఈ ఉగ్రవాద స్థావరం ఎల్ఓసీ నుండి 10 కి.మీ దూరంలో ఉంది.
8. సర్జల్ క్యాంప్ - జైష్ శిక్షణా కేంద్రం సాంబా-కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దు నుండి 8 కి.మీ దూరంలో ఉంది.
9 మెహమూనా క్యాంప్ (సియాల్కోట్ సమీపంలో) – ఇది హిజ్బుల్ ముజాహిదీన్ శిక్షణా శిబిరం మరియు అంతర్జాతీయ సరిహద్దు నుండి 15 కి.మీ దూరంలో ఉంది.