ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాకిస్థాన్లోని ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. అర్థరాత్రి 1:44 గంటల సమయంలో పాక్పై భారత్ విరుచుకుపడింది. అయితే ఈ దాడులకు చేపట్టడానికి 15 నిమిషాల ముందు ఇండియన్ ఆర్మీ ఓ వీడియోను విడుదల చేసింది. ‘విజయం కోసం సాధన.. దాడికి సిద్ధం’ అని ఓ వీడియోను షేర్ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. ఇండియన్ ఆర్మీపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెప్పి.. పాక్కు సరిగ్గా బుద్ది చెప్పిందని కామెంట్లు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Operation Sindoor : పాక్పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ
"प्रहाराय सन्निहिताः, जयाय प्रशिक्षिताः"
— ADG PI - INDIAN ARMY (@adgpi) May 6, 2025
Ready to Strike, Trained to Win.#IndianArmy pic.twitter.com/M9CA9dv1Xx
ఉగ్రవాద శిబిరాలపై..
ఇదిలా ఉండగా పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ దాడులు చేసింది. ఇప్పటివరకు 90 మంది ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పాక్ మీడియా కూడా ధ్రువీకరించింది. పాకిస్తాన్ లోని బహవల్ పూర్ లోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ హెడ్ క్వార్టర్స్, జైషే మహ్మద్ కు చెందిన మదర్సాలో ఉగ్రవాదులు ఉన్నట్లు భారత ఆర్మీకి పక్కా సమాచారం అందింది.
ఇది కూడా చూడండి: BIG BREAKING : భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే.. లష్కరే తోయిబా కంచుకోట ఖతం!
Just 15 minutes before #OperationSindoor, the Indian Army dropped this video.
— MR . AK (@anandhumanoj666) May 7, 2025
Chills. Precision. Pure savage energy.#IndianArmy pic.twitter.com/I515RVreOj
ఇది కూడా చూడండి: BIG BREAKING : పాక్ దాడి.. ముగ్గురు భారత పౌరులు మృతి!
దీంతో ఆ ప్రాంతాల్లో భారత ఆర్మీ దాడులు చేసింది. దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. అయితే ఉగ్రవాద శిబిరాల మీద తప్ప పాక్ సైన్యం మీద అటాక్ చేయలేదని ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది.
Indian Army posted this video just 15
— Voice of Hindus (@Warlock_Shubh) May 6, 2025
Minutes ago before #OperationSindoor
Savage Indian Army 🔥 pic.twitter.com/NWyLjZu1Nu
ఇది కూడా చూడండి: BIG BREAKING: పాక్ పై భారత్ మెరుపు దాడి.. 30కి పైగా ఉగ్రవాదులు హతం!