/rtv/media/media_files/2025/05/07/ZmBkq1Jc7owfP59PeMCJ.jpg)
Operation Sindoor attack
Operation Sindoor Attack: పాకిస్తాన్లోని(Pakistan) ఉగ్రస్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ(Indian Army) చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ దాడిలో దాదాపు 200 మంది ఉగ్రవాదులు(Terrorists) హతం అయినట్లు తెలుస్తోంది. పాక్తో పాటు పీఓకే(POK)లో 9 ఉగ్రవాద శిబిరాలను ఇండియన్ ఆర్మీ మట్టిగరిపించింది. అందులో మురిడ్కేలోని టెర్రరిస్ట్ శిబిరాలపై భారత్ ఆర్మీ జరిపిన దాడిని చూసిన ఒక స్థానికుడు ఒళ్లుగగుళ్లుపుడిచే విషయాలు మీడియాతో పంచుకున్నాడు.
Also Read: 11, 12, 14 ఈ నెంబర్లకు ఆపరేషన్ సిందూర్కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?
లైవ్లో చూసిన సాక్షి
ఆపరేషన్ సిందూర్ గురించి మీడియాతో మాట్లాడుతూ.. తామంతా నిద్రపోతున్న సమయంలో సరిగ్గా 12.45 గంటల టైంలో ముందుగా ఒక డ్రోన్ చూశానని అన్నాడు. ఆ తర్వాత వరుసగా మరో మూడు డ్రోన్లు వచ్చాయని.. వెంటనే పెద్ద పేలుడు శబ్దం వినిపించడంతో తామంతా ఒక్కసారిగా మేలుకున్నామని.. అప్పుడు డ్రోన్ దాడులను లైవ్లో చూశామని తెలిపాడు. ఆ డ్రోన్లు మసీదులపై దాడి చేశాయని.. ఆ దాడిలో ప్రతీది ధ్వంసం అయిందని మురిడ్కేకు చెందిన ఒక స్థానికుడు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడి వీడియో వైలర్గా మారింది.
Also Read: Operation Sindoor : పాక్పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ
भारतीय सेना के अटैक को पाकिस्तान की जनता जो चश्मदीद था उसकी जुबानी सुनिए । बता रहा है ख़ौफ़ बहुत था रात जागकर गुजारी खुले में । देश का विपक्ष जो सबूत माँगता है हमेशा मोदीजी से वह भी सुन ले। pic.twitter.com/OsmsbH2X8b
— karara Tamacha (@SatishY0) May 7, 2025
Also Read: యావత్ దేశానికే గర్వకారణం.. ఆపరేషన్ సిందూర్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్!
latest-telugu-news | telugu-news