/rtv/media/media_files/2025/05/07/Qx9wS1eA7a9pvAWwNna7.jpeg)
Operation Sindoor: ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి భారత్ ఆపరేషన్ సిందూర్తో ప్రతీకారం తీర్చుకుంది. గతంలో కూడా ఇండియాపై పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన టెర్రర్ అటాక్లకు దెబ్బకు దెబ్బ తీసింది. 2016 నుంచి ఇండియా తీవ్రవాదుల దాడులకు ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించింది.
పారా కమాండోలతో సర్జికల్ స్ట్రైక్ 11
2016 సెప్టెంబర్ 18న యూరీ టెర్రర్ అటాక్ జరిగింది. జమ్మూకశ్మీర్లోని యూరీ ప్రాంతంలో నలుగురు టెర్రరిస్టులు భద్రతా బలగాలపై దాడి చేశారు. ఇందులో 18 మంది భారతీయ సైనికులు మరణించగా.. మరో 20 మందికి గాయాలు అయ్యాయి. దీనికి సమాధానంగా ఇండియా సర్జికల్ స్ట్రైక్ చేసింది. దానికోసం ఆర్మీలో మెరుపు దాడుల్లో ఎక్స్పర్ట్స్ అయిన పారా కమాండోలను రంగంలోకి దింపింది. 2016 సెప్టెంబర్ 29న ఇండియా సర్జికల్ స్టైక్ చేసింది. పాకిస్థాన్ నియంత్రణ రేఖను దాటి వెళ్లి, ఉగ్రవాదులపై దాడి చేసింది. దాదాపు 35 నుంచి 40 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. 11 రోజుల్లోనే ఇండియా ప్రతీకారం తీర్చుకుంది.
12 రోజులకే ఎయిర్ స్ట్రైక్స్
సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్పై 2019 ఫిబ్రవరి 14న ఉగ్రవాదుల ఆత్మహుతి దాడి జరిగింది. పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకార చర్యగా మళ్లీ ఇప్పుడు భారత్ సర్జికల్ స్ట్రైక్ను నిర్వహించింది. ఫిబ్రవరి 26న (మంగళవారం) తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. నియంత్రణ రేఖ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ భూభాగంలోని బాలాకోట్, పీఓకేలోని ముజఫర్బాద్, చికోటీలోని ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై ఎయిర్ స్ట్రైక్ చేసింది. మిరాజ్ 2000 రకానికి చెందిన 12 యుద్ధ విమానాలతో దాడిచేసినట్టు ఇండియన్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. జైషే మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాయిద్దీ ఉగ్రవాద శిక్షణ శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఇండియాలో జరిగిన దాడి 12 రోజులకే పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఎయిర్ స్ట్రైక్ జరిగింది.
పహల్గామ్ కుట్రపై 14 రోజుల్లోనే రివేంజ్
2025 ఏప్రిల్ 22న అనంత్నాగ్ జిల్లా బైసరన్ కొండప్రాంతాల్లోని పహల్గామ్లో పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులు చేశారు. ఆయుధాలతో ఇండియన్ ఆర్మీ దుస్తువుల్లో వచ్చి.. 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. అప్పటి నుంచి పాక్, భారత్ మధ్య యుద్ధ మేఘాలు కమ్మకున్నాయి. సరిగ్గా అది జరిగిన రెండు వారాలకే (మే 6) పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది ఇండియన్ ఆర్మీ. మంగళవారం అర్థరాత్రి దాటాక...బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్ గాఢనిద్రలో ఉన్న సమయంలో సరిగ్గా 1.44 నిమిషాలకు ఏకకాలంలో పాకిస్థాన్ లోని 9 ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది. పీఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను కేవలం 23 నిమిషాల వ్యవధిలోనే మట్టుబెట్టింది. తొమ్మిది స్థావరాల్లో తలదాచుకుంటున్న జైషే ఈ మహ్మద్, లష్కరే సంస్థల అగ్ర నేతలు హతం అయ్యారు.
(operation sindoor latest | surgical-strike | operation sindoor air strike | indian-air-force | latest-telugu-news)