/rtv/media/media_files/2025/10/05/arvind-kejriwal-2025-10-05-07-52-29.jpg)
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(arvind-kejriwal) గోవాలో వచ్చే (2027) అసెంబ్లీ ఎన్నికలకు(goa-elections) సంబంధించి కీలక ప్రకటన చేశారు. గోవాలో కాంగ్రెస్ పార్టీతో తమకు ఎలాంటి పొత్తు ఉండబోదని, ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన కేజ్రీవాల్, ఆ పార్టీ గోవా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హోల్సేల్గా తమ ఎమ్మెల్యేలను బీజేపీకి అప్పగించిందని ఆయన ఆరోపించారు.
AAP’s Goa Drama Exposes #Congress’ Rotten Core
— Amulya Reddy BJP 🪷 🇮🇳🕉️ (Modi Ka Parivar) (@ARK_Bharatiya7) October 4, 2025
Even Arvind Kejriwal admits what #India already knows Congress has become a “wholesale supplier of MLAs” to the BJP wherever it’s in decline. From Goa to Karnataka to Madhya Pradesh Congress MLAs have repeatedly sold the people’s… pic.twitter.com/6IdWlykNFj
Also Read : పిల్లలకు దగ్గు మందు సిరప్ ఇచ్చిన డాక్టర్ అరెస్ట్
బీజేపీ, కాంగ్రెస్ అవినీతి రాజకీయాలు
గోవాలో బీజేపీ(bjp), కాంగ్రెస్ పార్టీలు(congress party) కలిసిపోయి అవినీతి రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఈ రాజకీయ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ అన్నారు. 2017, 2019 మధ్య కనీసం 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి మారారు. 2022లో, 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారి బీజేపీలో చేరారు" అని అన్నారు. గోవా వనరులపై ప్రజలకు హక్కు ఉండేలా, కొత్త వ్యవస్థను తీసుకురావడమే తమ లక్ష్యమని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆప్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గోవాను పాలిస్తున్న పాత రాజకీయ వ్యవస్థను తొలగించడం ద్వారా కొత్త రాజకీయ వ్యవస్థను అందిస్తామని కేజ్రీవాల్ ప్రతిజ్ఞ చేశారు. గోవా శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి 2027లో జరుగుతాయని సమాచారం.
Also Read : పాకిస్తాన్కు చుక్కలు చూపించడానికి.. ఇండియా ఎయిర్ డిఫెన్స్ గన్స్ కొనుగోలు
భగవద్గీత చదివాను
తాను జైలులో ఉన్నప్పుడు భగవద్గీతను ఐదు నుండి ఆరు సార్లు చదివానని కేజ్రీవాల్ అన్నారు. గోవాలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే సమయంలో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. భగవద్గీత కర్మ యోగం (ఫలితాన్ని ఆశించకుండా నిస్వార్థంగా పని చేయడం) ప్రాముఖ్యతను గురించి చెబుతుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. గీతలోని ఈ సందేశాన్ని ప్రస్తావిస్తూ, ఆప్ కార్యకర్తలు మొహల్లా క్లినిక్ల ద్వారా ప్రజలకు సేవ చేయాలని, దీని ద్వారా పుణ్యం లభిస్తుందని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయనను ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. ఆ సమయంలోనే ఆయన తీహార్ జైలులో ఉన్నారు. జైలుకు వెళ్లినప్పుడు ఆయన తనతో పాటు భగవద్గీత, రామాయణం వంటి గ్రంథాలను తీసుకెళ్లడానికి న్యాయస్థానం నుండి అనుమతి తీసుకున్నారు.
STORY | Read Bhagavad Gita five to six times when I was in jail: Kejriwal
— Press Trust of India (@PTI_News) October 4, 2025
Aam Aadmi Party (AAP) convenor Arvind Kejriwal on Saturday said that during his time in jail, he read the Bhagavad Gita, which emphasises ‘karma yoga’ (path of selfless action), five to six times.
READ:… pic.twitter.com/vdPGpFN5yd