పుష్ప 2 పాటకు మాజీ సీఎం డాన్సులు|Kejriwal & Bhagwant Mann On The Occasion Of Harshith Wedding|RTV
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. 2019లో హోర్టింగ్లు ఏర్పాటు చేసేందుకు ప్రజానిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో నమోదైన పిటిషన్పై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
మద్యం కుంభకోణానికి సంబంధించిన కాగ్ (CAG) నివేదికను రేఖా గుప్తా సర్కార్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC)కు పంపించింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో గత ప్రభుత్వం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంపై మంత్రి పర్వేశ్ వర్మ దర్యాప్తునకు ఆదేశించారు.
సీఎం రేఖా గుప్తాకు ప్రతి నెల రూ.1.70 లక్షల జీతం వస్తుంది. ఈ జీతాన్ని 2023, మార్చి నాటి ఆదేశం ప్రకారం నిర్ణయించారు. ఇందులో ఆమె ప్రాథామిక జీతం(బేసిక్ శాలరీ) రూ.60,000 ఉంటుంది. అరవింజ్ కేజ్రీవాల్ మాజీ ఎమ్మెల్యేలాగే రూ.15 వేల పెన్షన్ వస్తుంది.
కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ భవనం మరమ్మతులో భాగంగా అవినీతికి పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(CVC) దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
కేజ్రీవాల్ నివాసం ఉన్న శీష్ మహల్ అంశం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ వార్త ప్రచారం అవుతోంది. ఢిల్లీ కొత్త సీఎం శీష్ మహల్లో నివాసం ఉండకపోవచ్చని సమాచారం. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమిపై ఆప్ మాజీ నేత ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ఈ ఓటమికి కేజ్రీవాలే కారణమంటూ ఆరోపణలు చేశారు. రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఉండాల్సి పార్టీనీ అరవింద్ కేజ్రీవాల్ అవినీతిమయం చేశారంటూ విమర్శించారు.
అతిషితో పాటు 22 మంది ఎమ్మల్యేలు అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రజల కోసం పనిచేయాలని కేజ్రీవాల్.. వారికి సూచనలు చేశారు. బీజేపీ హామీలు అమలు చేసేలా తాము చూస్తామని అతిషి మీడియాతో అన్నారు.