Arvind Kejriwal : కేజ్రీవాల్కు భారీ ఊరట.. కేసు కొట్టివేసిన కోర్టు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఉపశమనం లభించింది. 2017లో గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. శనివారం ఈ కేసుపై గోవాలోని మపుసా కోర్టులో విచారణ జరగగా.. కేజ్రీవాల్పై నమోదైన ఎఫ్ఐఆర్ను న్యాయస్థానం కొట్టివేసింది.