Dowry: దేశంలో పెరిగిన వరకట్న వేధింపులు.. NCRB రిపోర్టులో షాకింగ్ నిజాలు

దేశంలో వరకట్న వేధింపులు మళ్లీ పెరుగుతున్నాయి. 2023లో 14 శాతం నేరాలు పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తన నివేదికలో వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం.. ఆ ఏడాది 15,489 వరకట్న వేధింపు కేసులు నమోదయ్యాయి.

New Update
Ncrb Report Dowry Crimes Saw An Unprecedented Rise In 2023

Ncrb Report Dowry Crimes Saw An Unprecedented Rise In 2023

దేశంలో వరకట్న వేధింపులు(dowry) మళ్లీ పెరుగుతున్నాయి. 2023లో 14 శాతం నేరాలు పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తన నివేదికలో వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం.. ఆ ఏడాది 15,489 వరకట్న వేధింపు కేసులు నమోదయ్యాయి. ఈ వేధింపుల కారణంగా 6,156 మంది మహిళలు మృతి చెందారు. అయితే 2021లో చూసుకుంటే వరకట్న నిషేధ చట్టం కింద 13,568 కేసులు నమోదు కాగా.. 2022లో ఈ సంఖ్య 13,479కి తగ్గింది. కానీ 2023లో మాత్రం మళ్లీ కేసులు పెరిగాయి.   

Also Read: 200 ఏళ్ళ నాటి శాపం.. ఆ ప్రాంతంలో చీరలు కట్టుకొని పురుషుల నృత్యాలు!

NCRB Report Dowry Crimes

రాష్ట్రాల వారీగా చూసుకుంటే ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లో 7,151 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత బీహార్‌లో 3,665 కేసులు, కర్ణాటకలో 2322 కేసులు నమోదయ్యాయి. మరణాల పరంగా చూస్తే యూపీలోనే అత్యధికంగా 2,122 మరణాలు సంభవించాయి. ఆ తర్వాత బిహార్‌లో1,143 మరణాలు నమోదయ్యాయి. అంతేకాదు 2023లో 833 హత్యలు వరకట్న వేధింపుల వల్లే జరిగినట్లు రిపోర్టు పేర్కొంది. 

Also Read: లైవ్ వీడియో.. రూ.6 లక్షల నెక్లెస్‌ను క్షణాల్లో కొట్టేసిన మహిళ

ఇక 2023లో మొత్తం 83,327 వరకట్న సంబంధిత కేసులు న్యాయస్థానాల్లో పెండింగ్‌ ఉన్నట్లు NCBR తెలిపింది. వీటిలో 69,434 అంతకుముందు నుంచే పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొంది. అలాగే ఆ ఏడాది వరకట్న నేరాలకు సంబంధించి 27,154 మందిని పోలీసులు అరెస్టులు చేశారు. వీళ్లలో 22,316 మంది పురుషులు ఉండగా.. 4,838 మంది మహిళలు ఉన్నారు. 

Also Read: న్యూ యార్క్ లో ఘోర ప్రమాదం...ఎయిర్ పోర్ట్ లో ఢీకొన్న రెండు విమానాలు

Advertisment
తాజా కథనాలు