/rtv/media/media_files/2025/06/27/mp-sandeepanrao-bhumre-2025-06-27-11-48-53.jpg)
అదృష్టం వరించేలోపు దురదృష్టం అడ్డం తిరగడం అంటే ఇదే. మహారాష్ట్రలోని శివసేనా ఎంపీ రూ.150 కోట్లు విలువైన 3ఎకరాల భూమి తన డ్రైవర్కు గిఫ్ట్గా ఇచ్చాడు. ఎంపీ హైదరాబాద్కు చెందిన ప్రసిద్ధ సాలార్ జంగ్ కుటుంబ వారసుడు సందీపన్రావ్ భూమ్రే. ఆయన డ్రైవర్కు సీక్రెట్గా మూడెకరాల భూమి బహుమతిగా ఇచ్చాడు. అయితే దాని విలువ ప్రస్తుతం రూ.150 కోట్లు. దీంతో ఛత్రపతి శంభాజీనగర్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.
Also Read : YS జగన్కు ఏపీ హైకోర్టు ఊరట.. కారు ప్రమాదం కేసులో కీలక ఆదేశాలు
MP Gift To Driver
#Shivsena's Aurangabad MP @SandipanBhumare and his MLA son @Vilas_Bhumare's driver gets Rs 150 cr land as a gift from #SalarJung kin
— Mohammed Akhef TOI (@MohammedAkhef) June 27, 2025
The driver, with no blood relations with Salar Jung family, and working on a meagre salary of ₹15k-20k/mo, has received gift worth ₹150 cr
N/1 pic.twitter.com/ATNx8QVysC
Also Read : 'కన్నప్ప' లో ఆ సీన్ హైలైట్.. మంచు విష్ణు నటనకు కన్నీళ్లు ఆగవు!
ఎంపీ సందీపన్రావ్ భూమ్రే, ఆయన కొడుకు ఎమ్మెల్యే విలాస్ భూమ్రేలకు 13ఏళ్లుగా జావేద్ రసూల్ షేక్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అందుకు కృతజ్ఞతగా వారు జావేద్ రసూల్ షేక్కు 3 ఎకరాల భూమి ఇచ్చారు. దానిపై పలు అనుమాలతో ముంబై ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. విచారణకు తాను సహకరిస్తున్నానని, దర్యాప్తు అధికారులు అడిగిన వివరాలను ఇప్పటికే సమర్పించానని జావేద్ తెలిపారు. సాలార్ జంగ్ కుటుంబ వారసులతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, కాబట్టి వారు నాకు భూమిని బహుమతిగా ఇచ్చారని ఆయన అన్నారు.
Also Read : షాకింగ్ వీడియో.. తన మూత్రంతో కళ్ళు కడుకున్న మహిళ - దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!
సంభాజీనగర్లోని జల్నా రోడ్డు వెంబడి ఉన్న దావూద్పురాలోని విలువైన ల్యాండ్ ఉంది. అది తన పేరు మీద గిఫ్ట్ డీడ్ ఉందని పర్భానీకి చెందిన ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదు మేరకు జావేద్ను పిలిపించినట్లు పోలీసు కమిషనర్ ప్రవీణ్ పవార్ గురువారం తెలిపారు. జావేద్ ఆదాయపు పన్ను రిటర్న్, ఇతర ఆదాయ వనరుల వివరాలను చెక్ చేసినట్లు ఆయన చెప్పారు. పైథాన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విలాస్, జావేద్ పేరు మీద ఉన్న భూమి బదిలీ దస్తావేజు వివాదంలోకి తనను, అతని తండ్రిని పోలీసులు లాగారని ఆరోపిస్తూ నిరసన తెలిపారు.
Also Read : ఏపీలో దారుణం.. ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి స్పాట్లో మహిళ మృతి
latest-telugu-news | mumbai | shivasena