/rtv/media/media_files/2025/06/24/ys-jagan-car-seized-2025-06-24-20-47-34.jpg)
YS జగన్మోహన్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. సింగయ్య మృతి కేసులో జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిగింది. ఈ మేరకు పిటిషన్పై విచారణను మంగళవారానికి (జులై 1) వాయిదా వేసింది. అప్పటి వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. వైఎస్ జగన్తో పాటుగా వైవీ సుబ్బారెడ్డి, విడదల రజిని, పేర్ని నాని, కేఎన్నార్లపై కూడా వచ్చే మంగళవారం వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. సింగయ్య మృతి కేసులో తమపై పోలీసులు నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని జగన్తో పాటూ మిగిలిన వైఎస్సార్సీపీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
పల్నాడు జిల్లా సత్తెన్నపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జగన్ కాన్వాయ్ ఢీకొని సింగయ్య మరణించిన విషయం తెలిసిందే. నల్లపాడు పోలీసులు జగన్ కాన్వాయ్ వల్లే అతను మరణించాడని కేసు నమోదు చేశారు. జగన్ కారు కూడా పోలీసులు సీజ్ చేశారు. పలు సెక్షన్లపై ఆయనపై కేసు నమోదు చేశారు.