విపక్ష కూటమి సమావేశానికి హాజరవుతాం.... ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెల్లడి...!
విపక్ష ‘ఇండియా’ కూటమి నిర్వహించే మూడవ సమావేశానికి ఆప్ నేతలు హాజరవుతారా? లేదా అనే అనుమానాలకు తెరపడింది. ముంబైలో నిర్వహించబోయే సమావేశానికి తాము హాజరవుతామని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. తాము ముంబైకి వెళ్తామని, తమ వ్యూహమేంటో తెలియజేస్తామని మీడియాతో ఆయన అన్నారు.