/rtv/media/media_files/2025/05/10/iqrpI7xnSiCF1eois3zn.jpg)
Monsoon likely to reach Kerala on May 27, Says IMD
భారత్లో మరికొన్ని రోజుల్లో వేసవి కాలం ముగియనుంది. అయితే ఈసారి అంచనాల కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. మే 27నే రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత దేశమంతటా వర్షాలు కురవడం మొదలవుతాయి. జులై 8 నాటికి ఈ రుతుపవనాలు దేశమంతటా విస్తరిస్తాయి.
Also Read: ఎయిర్ రైడ్ సైరన్లను మీడియాలో చూపించొద్దు.. కేంద్రం కీలక ప్రకటన
మళ్లీ నార్త్వెస్ట్ భారత్ నుంచి సెప్టెంబర్ 17తో రుతుపవనాల ఉపసంహరణ మొదలవుతుంది. అక్టోబర్ 15 నాటికి ఇది ముగుస్తుంది. అయితే ఈసారి జూన్ 1 కంటే ముందుగానే మే 27న నైరుతి రుతుపనవాలు కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
Also Read: ఆపరేషన్ సిందూర్...ఐదుగురు పాకిస్తానీ ఉగ్రవాదులు హతం!
2024లో మే 30న నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. 2023లో జూన్ 8న, 2022లో మే 29న ప్రవేశించాయి. మరోవైపు ఈసారి వర్షకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యో ఛాన్స్ ఉందని వాతావరణశాఖ చెప్పింది. ఇదిలాఉండగా భారత్లో 52 శాతం నికర సాగు భూమికి వర్షపు నీరే ప్రధాన ఆధారం. దేశం మొత్తంగా చూసుకుంటే ఈ సాగు భూమి నుంచే 40 శాతం దిగుబడి వస్తుంది. అందుకోసమే నైరుతి రుతుపవనాలు అనేవి ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో కీలక పాత్ర పోషిస్తాయి.
Also Read: భారత్-పాక్ వార్.. బోర్డర్లో టెన్షన్ .. టెన్షన్.. ఇప్పటివరకు జరిగింది ఇదే..!
Also Read: దాడులు ఆపితే ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధం.. పాక్ కాళ్ల భేరం!
telugu-news | weather-alert | rains | monsoon