Crime: దారుణం.. కోడలిని చంపి పాతిపెట్టిన అత్త - మామలు !

హర్యానాలో దారుణం జరిగింది. భర్త, అత్తమామల వేధింపుల వల్ల ఓ వివాహిత(24) బలైపోవడం కలకలం రేపింది. ఫరీదాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 10 లోతుల గుంత నుంచి పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని బయటికి తీశారు.

New Update
Missing Faridabad woman's body found buried outside her in-laws' house

Missing Faridabad woman's body found buried outside her in-laws' house

హర్యానాలో దారుణం జరిగింది. భర్త, అత్తమామల వేధింపుల వల్ల ఓ వివాహిత(24) బలైపోవడం కలకలం రేపింది. ఫరీదాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 10 లోతుల గుంత నుంచి పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని బయటికి తీశారు. మృతురాలు యూపీలోని షికోహాబాద్‌ వాసిగా గుర్తించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఫరీదాబాద్‌లోని రోషన్‌నగర్‌కు చెందిన అరుణ్ అనే వ్యక్తితో రెండేళ్ల  క్రితం ఆమెకు పెళ్లైంది. అయితే ఇటీవల వాళ్ల ఇంటిపక్కన మురుగు కాలువ నిర్మాణం కోసం తవ్విన గుంతలో ఆమె మృతదేహం బయడింది. 

Also Read: ఎయిరిండియా నుంచి వాళ్లని తొలగించండి.. DGCA సంచలన ఆదేశాలు

Also Read :  హోటల్‌లో దంపతుల శృంగారం.. కిటికీలు వేసుకోవడం మర్చిపోవడంతో..?

Missing Faridabad Woman's Body

ఆమెను తన భర్త, అత్తామామలు పూడ్చిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.  అయితే ఆమెకు 2023లో వివాహం జరిగిన తర్వాత తన అత్తవారింట్లో మానసికంగా , శారీరకంగా వేధింపులకు గురైనట్లు ఆమె సోదరి ప్రితీ చెప్పారు. తన సోదరిని బంగారు నగలు, డబ్బులు ఇవ్వాలని ఆమె భర్త, అత్తమామలు డిమాండ్ చేశారని తెలిపింది. వాళ్ల డిమాండ్లు తీర్చేందుకు యత్నించినా కూడా ఇంకేదో కావాలని తనను వేధించారని ఆరోపించింది.  

భర్త, అత్తమామలు పెట్టే ఇబ్బందులు భరించలేక తాను పుట్టింటికి వచ్చిందని.. అక్కడే చాలా రోజుల పాటు ఉందని తెలిపింది. ఆ తర్వాత ఆమెను మళ్లీ అత్తవారింటికి పంపించగా మళ్లీ తన సోదరికీ వేధింపులు ఇంకా పెరిగాయని వాపోయింది. '' ఏప్రిల్ 23 ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందని తన అత్తమామలు మాకు చెప్పారు. ఆమెకు ఫోన్‌ చేస్తే కాల్‌ కలవలేదు. మాకు అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశాం. కానీ పోలీసులు ఇందులో చర్యలు తీసుకోలేదు. 

Also Read: ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే.. 7ఏళ్లు జైలుశిక్ష, రూ.10 ల‌క్షల జరిమానా!

ఇంతలోనే వాళ్ల ఇంటికి సమాపంలో తన మామ గొయ్యిని తవ్వారు. అది మురుగునీటి పారుదలకు తవ్వినట్లు చుట్టుపక్కల వారికి చెప్పారు. అప్పటినుంచి నా సోదరి కనిపించడం లేదని'' ప్రతీ వివరించింది. మరోవైపు ఈ కేసుపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్) ఉషా కుండు మాట్లాడారు. వారం క్రితం ఈ ఘటనపై ఈ ఫిర్యాదు వచ్చిందని.. పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. గుంతలో నుంచి తన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారని.. ఈ ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

Also Read :  మాదాపూర్‌లో భారీ మోసం.. బై బ్యాక్‌ పేరుతో రూ.500 కోట్ల దోపిడీ

 

national-news | murder | crime | haryana | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు