AV Constructions Scams : మాదాపూర్‌లో భారీ మోసం.. బై బ్యాక్‌ పేరుతో రూ.500 కోట్ల దోపిడీ

మాదాపూర్‌లో భారీ మోసం వెలుగు చూసింది..ఏవీ ఇన్ఫ్రాకాన్  ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ బై బ్యాక్‌ పేరుతో రూ.500 కోట్ల మోసానికి పాల్పడింది.  తమ సంస్థలో పెట్టుబడి పెట్టినవారికి డబుల్‌ అమౌంట్‌ ఇస్తామని సంస్థ యజమానులు నమ్మించారు..బాధితుల వద్ద కోట్లు వసూలు చేశారు.

New Update
AV Constructions Scams

AV Constructions Scams

మాదాపూర్‌లో భారీ మోసం వెలుగు చూసింది..ఏవీ ఇన్ఫ్రాకాన్  ప్రైవేటు లిమిటెడ్‌  సంస్థ బై బ్యాక్‌ పేరుతో రూ.500 కోట్ల మోసానికి పాల్పడింది.  బాధితుల వద్ద సంస్థ కోట్ల రూపాయలు వసూలు చేసింది.. తమ సంస్థలో పెట్టుబడి పెట్టినవారికి డబుల్‌ అమౌంట్‌ ఇస్తామని సంస్థ యజమానులు నమ్మించారు.. ఒకవేళ అమౌంట్‌ ఇవ్వకపోతే దానికి తగిన ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తామని హామీ ఇచ్చారు.. 18 నెలలకు 50 శాతం అదనంగా ఇస్తానని భారీగా వసూలు చేశాడు ఏవీ ఇన్ఫ్రా ఛైర్మన్ విజయ్ గోగుల. అయితే ఎంతకు డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు ఎదురు తిరిగి ప్రశ్నించడంతో మరో చోట ప్రాజెక్టు అంటూ మోసం చేశారు.

Also Read :  ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి

Huge Fraud In Madhapur

ఏవీ ఇన్ఫ్రాకాన్ పేరిట  బై బ్యాక్ పాలసీ ద్వారా అనతి కాలంలోనే ఒకటికి రెండింతలు డబ్బులు ఇస్తామంటూ చెప్పి బాధితులను నట్టేటా ముంచేశారు. దీంతో బాధితులు సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో, మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మాదాపూర్ కేంద్రంగా బై బ్యాక్ పేరుతో వసూళ్లు చేపట్టాడు ఏవీ ఇన్ఫ్రాకాన్ చైర్మన్‌ విజయ్‌ గోగుల. దుర్గం చెరువు ఏవీ ఇన్ఫ్రా కార్యాలయం ఏర్పాటు చేసి ఆ కార్యాలయం కేంద్రంగా దందా ప్రారంభించాడు. సుమారు 500 మంది బాధితుల నుంచి రూ.500 కోట్ల వరకు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తమ సంస్థకు నారాయణఖేడ్, యాదగిరిగుట్ట, బుదేరా తదితర ప్రాంతాల్లో వెంచర్లు ఉన్నాయంటూ నమ్మించాడు.  దీంతో నమ్మిన పలువురు బాధితులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు.

Also Read :  ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం

అయితే ఎంతకు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు  అడిగితే 18 నెలల తర్వాత ఇంకో ప్రాజెక్ట్ ఉంది అక్కడ ఇస్తాను అంటూ దాటవేసే ప్రయత్నం చేశాడు ఛైర్మన్ విజయ్. అయితే బాధితులు మరింత గట్టిగా నిలదీయడంతో  బ్లాంక్ చెక్కులు ఇస్తూ తప్పించుకొని తిరుగుతున్నాడు. దుర్గం చెరువు దగ్గర ఏవీ ఇన్ఫ్రా కార్యాలయం కేంద్రంగా దందా ప్రారంభించాడు. ఈ సంస్థలో రాజు అనే వృద్ధుడు ఏకంగా రూ.84 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు వాపోయాడు. ప్రస్తుతం విజయ్ పై మాదాపూర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్‌లు మింగించి!

Also Read :  ఏపీలో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త ఆత్మహత్యాయత్నం

 

Real Estate Builders | hyderabad real estate fraud | Real Estate in hyderabad

Advertisment
Advertisment
తాజా కథనాలు