Fake News Law: ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే.. 7ఏళ్లు జైలుశిక్ష, రూ.10 ల‌క్షల జరిమానా!

క‌ర్నాట‌క ప్రభుత్వం ఫేక్ న్యూస్ అరికట్టడానికి కీలక నిర్ణయం తీసుకుంది. సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకోనున్నారు. ఎవరైనా ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తే.. వాళ్లకు ఏడేళ్ల జైలుశిక్ష, రూ.10 ల‌క్షల జ‌రిమానా విధించ‌నున్నారు.

New Update
fake news law proposal

Fake News Law: క‌ర్నాట‌క రాష్ట్ర ప్రభుత్వం ఫేక్ న్యూస్ అరికట్టడానికి కీలక నిర్ణయం తీసుకుంది. సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నవారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకోనున్నారు. స‌మాచార దుర్వినియోగాన్ని అడ్డుకోడానికి ఒక‌వేళ ఎవరైనా ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తే, వాళ్లకు ఏడేళ్ల జైలుశిక్ష, రూ.10 ల‌క్షల జ‌రిమానా విధించ‌నున్నారు. దీనిపై క‌ర్నాట‌క స‌ర్కారు ముసాయిదాను త‌యారు చేసింది. 

Also Read: వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్‌లు మింగించి!

Also Read :  ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి

క‌ర్నాట‌క మిస్ఇన్ఫర్మేష‌న్ అండ్ ఫేక్ న్యూస్ యాక్ట్ ముసాయిదాను రెండేళ్ల క్రితం రూపొందించారు. అయితే గ‌త వారం దాన్ని క్యాబినెట్ ముందు ప్రవేశ‌పెట్టారు. సోష‌ల్ మీడియాలో ఫేక్ న్యూస్‌ను నియంత్రించేందుకు క‌ర్నాట‌క స‌ర్కారు ప్రత్యేక కోర్టుల‌ను కూడా ఏర్పాటు చేస్తున్నది. త్వర‌గా కేసుల‌ను ప‌రిష్కరించేంందుకు ఈ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ప్రతి స్పెష‌ల్ కోర్టుకు ఓ ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్‌ను నియ‌మిస్తారు. ఇవన్నీ ఆ రాష్ట్రంలో తర్వరలోనే చట్టబద్దం కానున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు