Air India: ఎయిరిండియా నుంచి వాళ్లని తొలగించండి.. DGCA సంచలన ఆదేశాలు

అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది. విమానంలో భద్రతా లోపానికి కారణమైన ముగ్గురు ఉద్యోగులను విధుల నుంచి తొలిగించాలని ఆదేశించింది.

New Update
DGCA Directs Air India To Remove 3 Senior Officials Over Recent Safety Lapses

DGCA Directs Air India To Remove 3 Senior Officials Over Recent Safety Lapses

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది.విమానంలో భద్రతా లోపానికి కారణమైన ముగ్గురు ఉద్యోగులను విధుల నుంచి తొలిగించాలని ఆదేశించింది.

Also Read: ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే.. 7ఏళ్లు జైలుశిక్ష, రూ.10 ల‌క్షల జరిమానా!

 డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ చూరా సింగ్, డీఓపీఎస్‌ చీఫ్ మేనేజర్ పింకీ మిట్టల్, క్రూ షెడ్యూలింగ్, ప్లానింగ్‌ని చూసుకునే పాయల్‌ ఆరోరాను తొలగించాలని ఎయిర్ ఇండియాకు ఆదేశాలు జారీ చేసింది.  మరోవైపు విమానంలో భద్రతపై ప్రయాణికులు, ఉద్యోగులకు ఎయిర్ ఇండియా CEO విల్సన్ శుక్రవారం భరోసా ఇచ్చారు. ఇలా హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే డీసీజీఏ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

Also Read: ఇరాన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న 290 మంది భారతీయులు

 

Advertisment
Advertisment
తాజా కథనాలు