Meerut Murder Case: మాదక ద్రవ్యాలకు బానిసలై..తిండి తినకుండ..!

ఉత్తర్‌ ప్రదేశ్‌ నేవీ అధికారి హత్య కేసులో అరెస్టైన ముస్కాన్‌, ఆమె ప్రియుడు సాహిల్‌ మాదక ద్రవ్యాలకు బానిసలైనట్లు తెలుస్తుంది.జైల్లో ఆహారం తినకుండా తమకు గంజాయి, మత్తు ఇంజెక్షన్లు ఇవ్వాలని కోరుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

New Update
meerut

meerut

ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని మేరఠ్‌ లో వెలుగు చూసిన మర్చంట్‌ నేవీ అధికారి హత్య కేసులో అరెస్టైన ముస్కాన్‌, ఆమె  ప్రియుడు సాహిల్‌ కు సంబంధించిన కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. వీరిద్దరూ మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారారని పేర్కొన్నారు. జైల్లో ఆహారం తినకుండా తమకు గంజాయి, మత్తు ఇంజెక్షన్లు ఇవ్వాలని కోరుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Also Read: Minister Seethakka-Padi Koushik Reddy: తమ్ముడూ మా ఇంటికి భోజనానికి రండి అంటూ పాడి కౌశిక్‌ రెడ్డిని ఆహ్వానించిన సీతక్క!

అరెస్ట్‌ నాటి నుంచి అవి వారికి దొరక్కపోవడంతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని..తరచూ గంజాయి కోసం డిమాండ్‌ చేస్తున్నారన్నారు. జైలుకు వచ్చిన మొదటి రోజు నుంచి నిందితుల ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలు పెట్టిందని అధికారులు పేర్కొన్నారు.దీంతో సాహిల్‌ ను ఆస్పత్రికి తరలించగా అక్కడ తీవ్ర గందరగోళం సృష్టించాడని..గంజాయి ఇవ్వాలని డిమాండ్ చేశాడని తెలిపారు.

Also Read: TG Crime: హైదరాబాద్‌లో దారుణ హత్య.. వేటాడి వెంటాడి గొడ్డళ్లతో నరికి చంపిన దుండగులు

మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల వారు తోటి ఖైదీల పై దాడి చేసే అవకాశం ఉండడంతో వేరేగా ఉంచినట్లు తెలిపారు. నిందితులు ఇద్దరు ప్రతిరోజు మాదక ద్రవ్యాల ఇంజెక్షన్లు తీసుకుంటారని గుర్తించామని ...అవి లేకపోవడంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. హత్య సమయంలోనూ సాహిల్‌ డ్రగ్స్‌ మత్తులోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

దీంతో వారిని జైలులోని డీ అడిక్షన్‌ సెంటర్‌ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. సౌరభ్‌ రాజ్‌పుత్‌ ,ముస్కాన్‌ 2016 లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు మర్చంట్‌ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె పుట్టింది. ఆ తరువాత ముస్కాన్‌ కు సాహిల్‌ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.దీంతో భార్యభర్తలిద్దరూ విడాకుల వరకు వెళ్లారు.

కానీ కూతురు కోసం సౌరభ్‌ వెనక్కి తగ్గినట్లు సమాచారం. తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన అతడు ..పోయిన నెల కూతురు పుట్టిన రోజు కోసం తిరిగి వచ్చాడు.ఇది నచ్చని ముస్కాన్‌...ప్రియుడితో కలసి భర్తను హత్య చేసింది.అక్కడితో ఆగకుండా అతడి శరీరాన్ని ముక్కలుగా చేసి ఓ డ్రమ్ములో వేసి పైన సిమెంట్‌ చేసింది. 

Also Read:Hamas-Israel: హమాస్‌ కీలక రాజకీయ నేత, ఆయన భార్య హతం!

Also Read: NTR Dist: పదవ తరగతి సంస్కృతం పేపర్లు తారుమారు..తిప్పలు పడ్డ విద్యార్థులు!

uttarapradesh | meerut | Meerut Case | Meerut Husband | Meerut Husband Case | Meerut Merchant Navy Officer | Meerut Merchant Navy Officer case | Meerut Merchant Navy Officer case update | latest-news

Advertisment
Advertisment