/rtv/media/media_files/2025/05/22/fCthrybFYtbzUwimJCwf.jpg)
Encounter
Chhattisgarh Encounter: గత కొన్ని రోజులుగా సాగుతున్న వరుస ఎన్ కౌంటర్లలో భద్రతా దళాలదే పై చేయి అవుతుంది. రోజు ఏదో ఒకచోట జరుగుతున్న ఎన్ కౌంటర్లలో మావోయిస్టు(Maoist) అగ్రనేతలు నేలకొరుగుతున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్ బీజాపూర్(Chhattisgarh Bijapur) అడవులు మరోసారి ఎన్కౌంటర్ కాల్పులతో మారుమోగాయి. ఈ భారీ ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. నక్సల్స్, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పలు కొనసాగుతున్నాయి. కాగా నిన్న జరిగిన భీకర ఎన్ కౌంటర్ లో మావో సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు సహా 27 మంది మావోలు మృతి చెందిన విషయం తెలిసిందే.
ఇది కూడా చూడండి:Delhi: ఢిల్లీ-శ్రీనగర్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు.. వీడియో వైరల్!
ఇది కూడా చూడండి: Cherry Tomatoes: చెర్రీ టమోటాల గురించి విన్నారా? ఈ 5 అద్భుతమైన ప్రయోజనాల తప్పక తెలుసుకోండి!
బీజాపూర్ అడవుల్లో ఎన్కౌంటర్..
సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న తుమ్రేల్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు, 21న, జిల్లా సుక్మా DRG, STF, కోబ్రా సంయుక్త పోలీసు బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కోసం బయలుదేరాయి. ఆపరేషన్ లో భాగంగా ఈరోజు ఉదయం నుండి భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య అడపాదడపా ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్ స్థలం,పరిసర ప్రాంతాలలో భద్రతా దళాలు ముమ్మర తనిఖీలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవుల్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. కాగా మృతుల్లో అగ్రనాయకులుంటారన్న ప్రచారం కొనసాగుతోంది. కాగా ఎన్కౌంటర్ను సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్, ఏఎస్పీ ఉమేష్ గుప్తాలు సమీక్షిస్తున్నారు. కాగా పీడియా అటవీ ప్రాంతంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చూడండి: భారతదేశ అణుశక్తి వాస్తుశిల్పి డాక్టర్ శ్రీనివాసన్ గురించి మీకు తెలుసా..?
ఇది కూడా చూడండి:Delhi: ఢిల్లీ-శ్రీనగర్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు.. వీడియో వైరల్!
Also Read : జరిమానా వేసినా బుద్ధి మారలే.. దిగ్వేశ్తో గొడవపై అభిషేక్ షాకింగ్ కామెంట్స్!