Air India Flight: షాకింగ్.. ఎయిర్ ఇండియా విమానంలో ఏడుగురికి అస్వస్థత..

లండన్ నుండి ముంబై వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో 7గురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో విమానం ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత.. వారందరినీ మెడికల్ రూమ్‌కు తరలించి ట్రీట్మెంట్ అందించారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగుపడినట్లు తెలుస్తోంది.

New Update
london to mumbai air india flight 5 passengers and 2 crew members feels unwell mid air

london to mumbai air india flight 5 passengers and 2 crew members feels unwell mid air

లండన్ నుండి ముంబై వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో కొంతమంది ప్రయాణీకులు, సిబ్బంది ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో విమానం ముంబై ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత.. అందరినీ మెడికల్ రూమ్‌కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగుపడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి.. 350కి పైగా డ్రోన్లతో కాల్పులు

Air India Flight

ఎయిర్ ఇండియా విమానం 130 లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుండి ముంబైకి బయల్దేరింది. అలా విమానం గాల్లో ఉన్న సమయంలో లోపల ఉన్న ఐదుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఆరోగ్య పరిస్థితి దిగజారింది. వీరందరికీ ఉన్నట్టుండి అకస్మాత్తుగా తల తిరుగుతూ, వికారం మొదలైంది. 

Also Read: అమెరికా మరో సంచలన నిర్ణయం..  ఇమ్మిగ్రెంట్‌ వీసాల కోసం బిగ్ అలెర్ట్!

దీంతో విమానాన్ని ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం వైద్య బృందం అక్కడికి చేరుకుని వారిని మెడికల్ రూమ్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ వారందరికీ చికిత్స అందించారు. ఈ సంఘటన గురించి ఎయిర్ ఇండియా ప్రతినిధి పూర్తి సమాచారం అందించారు. 

Also Read: నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.. అలాంటి మగవాళ్లే టార్గెట్..వలలో 12 మంది అమాయకులు!

‘‘విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండ్ అయింది. మా వైద్య బృందం ప్రయాణికులకు, సిబ్బందికి తక్షణ సహాయం అందించింది. ల్యాండింగ్ తర్వాత కూడా 2 ప్రయాణికులు, 2 సిబ్బంది అసౌకర్యంగా ఉన్నారు. వారిని మెడికల్ రూమ్‌కి తరలించారు. చికిత్స తర్వాత వారిని డిశ్చార్జ్ చేశారు. ఈ సంఘటనపై మేము దర్యాప్తు చేస్తున్నాము.’’ అని తెలిపారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు