Pakistan: పాక్‌ ర్యాలీలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు.. భారత్‌పై మరోసారి విద్వేష ప్రసంగం

పాక్‌లోని లాహోర్‌లో తాజాగా భారత్‌కు వ్యతిరేకంగా ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న లష్కరే తోయిబా కమాండర్‌ సైఫుల్లా కసురి భారత్‌పై మళ్లీ విద్వేష ప్రసంగం చేశాడు. మరో ఉగ్రవాది హఫీస్‌ సయీద్ కొడుకు తల్గా సయీద్‌ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

New Update
Lashkar-e-Taiba commander Saifullah Kasuri participated in a rally at Lahore, Pakistan

Lashkar-e-Taiba commander Saifullah Kasuri participated in a rally at Lahore, Pakistan

ఆపరేషన్ సిందూర్‌ తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కూడా పాకిస్థాన్‌ రోజురోజుకు బరితెగిస్తోంది. తాజాగా లాహోర్‌లోని భారత్‌కు వ్యతిరేకంగా ర్యాలీ చేశారు. అయితే ఈ ర్యాలీలో లష్కరే తోయిబా కమాండర్‌ సైఫుల్లా కసురి ప్రత్యక్షమయ్యాడు. భారత్‌పై ఇతడు మరోసారి విద్వేషపూరిత ప్రసంగం చేశాడు. అంతేకాదు వాంటెడ్‌ టెర్రరిస్టు అయిన హఫీస్‌ సయీద్ కొడుకు తల్గా సయీద్‌ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.  

Also Read: ఉన్నత చదువుల కోసం అమెరికాకు బదులుగా ఈ దేశాలే బెస్ట్

Lashkar-e-Taiba Terrorists

అలాగే పాకిస్థాన్ అణు పరీక్ష వార్షికోత్సవం పేరిటి అక్కడ సభ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా పహల్గామ్ ఉగ్రదాడి గురించి పాక్ మాజీ సైన్యాధికారి సంచలన విషయాలు బయటపెట్టారు. ప్రజలకు తనపై ఉన్న అసమ్మతిని మళ్లించడానికి ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పహల్గామ్ అటాక్‌కు కుట్ర చేశారని అన్నారు. ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌లోని బైసరన్ లోయలో టూరిస్టులపై కాల్పులు జరిపి 26 మందిని చంపేసిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సూత్రదారి పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కాగా.. దాన్ని పర్యవేక్షించింది ఐఎస్ఐ చీఫ్ అని పాక్ ఆర్మీ మాజీ మేజర్ ఆదిల్ రాజా వెల్లడించారు.  

Also read:  చైనా విద్యార్థుల వీసాల రద్దు? ట్రంప్ సర్కార్ మరో నిర్ణయం

ఇదిలాఉండగా POKలోని రావాల్ కోట్ జిల్లాలోని హుస్సేన్ కోట్ ప్రాంతంలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో నలుగురు ఉగ్రవాదులతో పాటూ ఇద్దరు పోలీసులు మృతి చెందారు. భద్రతా దళాలు అనుమానిత రహస్య స్థావరంపై దాడి చేసినప్పుడు ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు భద్రతా బృందంపై కాల్పులు జరిపి, హ్యాండ్ గ్రెనేడ్లు విసిరారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. మరోవైపు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు తమను తాము కూడా కాల్చుకున్నారు. దీంతో నలుగురు టీటీపీ ఉగ్రవాదులు మృతి చెందారు. ఇందులో తిరుగుబాటు నాయకుడు జరోమ్ నసీమ్ కూడా ఉన్నాడు. 

Also Read :  టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న RCB

Also Read :  మీ చర్మం నిగనిగలాడాలంటే ఈ ఫుడ్స్ మీ డైట్‌లో చేర్చుకోండి

telugu-news | rtv-news | pakistan | operation Sindoor 

Advertisment
Advertisment
తాజా కథనాలు