IndiGo Flight: ప్రమాదంలో మరో విమానం.. మేడే అంటూ పైలెట్ల సందేశం

గువాహాటి నుంచి చెన్నైకి వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు మేడే సందేశం ఇచ్చారు. ఆ తర్వాత విమానాన్ని బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అందులో 168 మంది ప్రయాణికులు ఉన్నారు.

New Update
IndiGo Flight

IndiGo Flight

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం జరిగాక వరుసగా ఎయిరిండియాతో పాటు ఇతర విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గువాహాటి నుంచి చెన్నైకి వెళ్తున్న ఇండిగో విమానం కూడా ప్రమాదంలో పడింది. దీంతో పైలట్లు మేడే సందేశం ఇచ్చారు. ఆ తర్వాత విమానాన్ని బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అందులో 168 మంది ప్రయాణికులు ఉన్నారు.

Also Read: పదిహేనేళ్ల సంసారంలో ఊహించని ట్విస్ట్ ! చంపుతుందనే భయంతో లవర్ తో భార్యకు పెళ్లి!

IndiGo Flight Declared 'Mayday

గురువారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానంలో తక్కువ ఇంధనం ఉండటం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే విమానంలోని పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి మేడే సందేశం ఇవ్వడంతో.. వైద్య, అగ్నిమాపక సహాయక బృందాలు విమానం ల్యాండ్ అయ్యే ప్రదేశానికి చేరుకున్నాయి. గురువారం రాత్రి 8.20 గంటలకు ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. 

Also Read :  ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి

మరోవైపు శుక్రవారం చెన్నై నుంచి మధురై వెళ్తున్న ఇండిగో విమానంలో కూడా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మళ్లీ విమానాన్ని వెనక్కి మళ్లించి చెన్నైలోనే ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో 68 మంది ప్రయాణికులు ఉన్నారు. ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలాఉండగా ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన తర్వాత మళ్లీ 9 ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో వాటిని వెనక్కి మళ్లించడం, ఎమర్జెన్సీ ల్యాండిగ్ చేయడం లాంటి పరిస్థితులు తలెత్తాయి .  

Also Read:  సంచలన అప్‌డేట్‌.. ఇరాన్‌లో భూకంపం రావడానికి కారణం అదే !

Also Read: Ananya Nagalla : కేరవాన్‌లో ఏడ్చేదాన్ని..  తెలుగు హీరోయిన్లను తొక్కేస్తున్నారు : అనన్య నాగళ్ల

 

air india | indigo-flight | rtv-news

Advertisment
Advertisment
తాజా కథనాలు