Earthquake: సంచలన అప్‌డేట్‌.. ఇరాన్‌లో భూకంపం రావడానికి కారణం అదే !

ఇరాన్‌లోని సెమ్నాన్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో ఈ భూకంపం వచ్చింది. అయితే ఇరాన్ సీక్రెట్‌గా అణు పరీక్షలు నిర్వహించి ఉండొచ్చని పలువురు నిపుణులు భావిస్తున్నారు. దీనివల్లే ఇది భూకంపానికి కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు.

New Update
Earthquake Of Magnitude 5.1 Hits Iran, Sparks Theories Of Nuclear Testing

Earthquake Of Magnitude 5.1 Hits Iran, Sparks Theories Of Nuclear Testing

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఇరాన్‌లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. సెమ్నాన్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో ఈ భూకంపం వచ్చింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే తాజాగా మరో కీలక అప్‌డేట్‌ వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్‌తో ఉద్రిక్త పరిస్థితుల వేళ.. ఇరాన్ సీక్రెట్‌గా అణు పరీక్షలు నిర్వహించి ఉండొచ్చని పలువురు నిపుణులు భావిస్తున్నారు. దీనివల్లే ఇది భూకంపానికి కారణం అయి ఉంటుందని అనుమానిస్తున్నారు.    

Also Read: హోటల్‌లో దంపతుల శృంగారం.. కిటికీలు వేసుకోవడం మర్చిపోవడంతో..?

Also Read :  'కుబేరా' సక్సెస్ సెలెబ్రేషన్స్.. శేఖర్ కమ్ముల, నాగార్జున ఫొటోలు వైరల్

Earthquake Of Magnitude

అంతేకాదు.. అంతరిక్ష, క్షిపణి కాంప్లెక్స్‌ ఉన్న సిటీకి దగ్గర్లోనే భూకంపం సంభవించింది. దీంతో అణు పరీక్షల వల్లే ఈ భూకంపం వచ్చిందనే ప్రచారం నడుస్తోంది. వాస్తవానికి ఇరాన్‌లోని సెమ్నాన్ ప్రావిన్సులోనే అంతరిక్ష కేంద్రంతో పాటు మిస్సైల్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. ఇరాన్ రక్షణశాఖ అధ్వర్యంలో ఇవి నడుస్తున్నాయి. వీటికి దగ్గర్లోనే భూకంపం సంభవించడం గమనార్హం. బలమైన భూ ప్రకంపనలు ఉత్తర ఇరాన్‌లోని చాలా ప్రాంతాలు తాకినట్లు తెలుస్తోంది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇరాన్ న్యూస్ ఏజెన్సీ ARNA తెలిపింది. 

Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!

ఇరాన్‌ కూడా ప్రపంచంలో భూకంప ముప్పు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఒకటి. అరేబియన్‌, యురేషియన్‌ టెక్టోనిక్‌ ప్లేట్లు కలిసే ఆల్పైన్‌-హిమాలయన్‌ సెస్మిక్‌ బెల్టు వెంట ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. దాదాపు ఏడాదికి 2 వేలకు పైగా భూకంపాలు వస్తుంటాయి. మరోవైపు అణ్వాయుధ కార్యక్రమాలు చేపట్టేటప్పుడు కూడా భూగర్భ పేలుళ్లు తీవ్ర ప్రకంపనలకు కారణమవుతాయి. పేలుడు సంభవించే చోట టెక్టోనిక్ ప్లేట్లపై తీవ్రంగా ఒత్తిడి పెరగడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇదిలాఉండగా అణు పరీక్షల వాదనను పలువురు భూకంప శాస్త్రవేత్తలు ఖండించారు. పది కిలోమీటర్ల లోతులో అణు పరీక్షలు చేపట్టరని.. అది అసాధ్యమని చెబుతున్నారు. 

Also Read :  బొమ్మ పిస్టల్ తో బెదిరించి దోపిడీ... 500 సీసీ కెమెరాలు శోధించి... తీగలాగితే..

 

israel iran war

 

Advertisment
Advertisment
తాజా కథనాలు