/rtv/media/media_files/DT8zJeNViJiLkqzpP1tJ.jpg)
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లోని ఒక గ్రామంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పదిహేనేళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకొని.. భార్యను ప్రియుడికి ఇచ్చి.. పెళ్లి చేశాడు ఓ భర్త! స్వయంగా దగ్గరుండి భార్యకు మరో వ్యక్తితో పెళ్లి జరిపించాడు. మరోవైపు భార్య తనకు బలవంతంగా ఈ పెళ్లి చేశాడని ఆరోపిస్తోంది. అసలు ఈ కథేంటో తెలియాలంటే మొత్తం స్టోరీ చదవాల్సిందే!
Also Read : భార్యపై అనుమానం..పిల్లలను చంపి..సూసైడ్ చేసుకుంటానని...
అసలేం జరిగింది?
అయితే ఉత్తరప్రదేశ్ లోని ఓ గ్రామానికి చెందిన హరీష్చంద్ర (42), కరిష్మా (36) దంపతులకు పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, మంగళవారం హరీష్చంద్ర తన భార్య కరిష్మాను శివరాజ్ చౌహాన్ అనే మరో వ్యక్తితో చూశాడట. దీంతో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. కానీ అక్కడ అతడికి ఎలాంటి పరిష్కారం లభించలేదు. దీంతో భర్త హరీష్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఓ పూజారీ సమక్షంలో తన భార్య నుదిటిపై ఉన్న సిందూరాన్ని తుడిచేసి.. ఆ తర్వాత కరిష్మాకు శివరాజ్తో వివాహం జరిపించాడు. ఈ దృశ్యం అక్కడున్న వారిని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది.
Also Read : ఎడ్సెట్ ఫలితాలు విడుదల.. ఇదిగో లింక్
భర్త ఆరోపణలు
అయితే ఈ ఘటనపై భర్త హరీష్చంద్ర మీడియాతో మాట్లాడుతూ, "కరిష్మా నన్ను విషం పెట్టి చంపడానికి ప్రయత్నించింది. మా కొడుకుకు మత్తు పదార్థాలు ఇచ్చి హాని చేయడానికి ప్రయత్నించింది" అని ఆరోపించాడు. అందుకే తాను ఆమెతో బంధాన్ని తెంచుకోవాలనుకుంటున్నానని తెలిపాడు. మరోవైపు భార్య కరిష్మా మాత్రం ఈ ఆరోపణలన్నింటినీ ఖండించారు. ఈ పెళ్లి తనపై బలవంతంగా రుద్దబడిందని వాదిస్తోంది. తన భర్తతో తనకు కొంత గొడవలు ఉన్నాయని అందుకే ఇలా చేశాడని ఆరోపించింది. శివరాజ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్థానికులకు తెలిపింది.
Also Read : సోషల్ మీడియాలో అందం చిట్కాలు ఎవరికి కోసమో తెలుసా..? సరైన సలహా లేకపోతే..!!
ఈ ఘటనపై ఖోడారే స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ప్రభోద్ కుమార్ మాట్లాడుతూ.. దీనిపై తమకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని చెప్పారు. ఒకవేళ ఫిర్యాదు అందినట్లయితే, పూర్తి స్థాయి దర్యాప్తు చేసి తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పెళ్లి తర్వాత కరిష్మా తమ కుమార్తెను తన వెంట తీసుకెళ్లింది. అలాగే హరీష్ కొడుకును తీసుకెళ్లాడు. పదిహేనేళ్ల బంధం, ఇద్దరు పిల్లలతో కూడిన ఒక కుటుంబం ఇలా అనూహ్యంగా విడిపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో నిజమెంత? ఎవరు తప్పు చేశారో స్పష్టంగా తెలియరావడం లేదు.
Also Read: Ananya Nagalla : కేరవాన్లో ఏడ్చేదాన్ని.. తెలుగు హీరోయిన్లను తొక్కేస్తున్నారు : అనన్య నాగళ్ల
telugu-news | Latest News