BIG BREAKING: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. మే15 వరకు ఈ ఎయిర్‌పోర్టులు క్లోజ్

దేశంలో 24 ఎయిర్‌పోర్టులను మూసి వేస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. భద్రతా దృష్ట్యా మే 15వ తేదీ వరకు మూసి వేస్తున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్‌లోని ఎయిర్‌పోర్టులను క్లోజ్ చేశారు.

New Update

భారత్-పాక్ యుద్ధ వాతావరణ కారణంగా దేశంలో మొత్తం 24 ఎయిర్‌పోర్టులను మూసి వేస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశానికి పశ్చిమ సరిహద్దులో ఉన్న విమానాశ్రయాలను భద్రతా దృష్ట్యా మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. సరిహద్దు ప్రాంతాల్లో పాక్ డ్రోన్లతో దాడులు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, రాజస్థాన్, గుజరాత్‌లలో ఉన్న 24 ఎయిర్‌పోర్టును మే 15వ తేదీ వరకు తాత్కాలికంగా మూసి వేస్తున్నారు.

ఇది కూడా చూడండి: IND-PAK WAR: వైమానిక దాడులు పగలు కాకుండా రాత్రే ఎందుకు జరుగుతాయి.. సీక్రెట్ ఇదే!

ఇది కూడా చూడండి: IND-PAK WAR: వార్ ఎఫెక్ట్.. Deloitte, HCL, టెక్ మహీంద్రాతో పాటు WFH ప్రకటించిన కంపెనీల లిస్ట్ ఇదే!

ఈ ఎయిర్‌పోర్టులు క్లోజ్..

పంజాబ్‌లోని అమృత్సర్, లూథియానా, పాటియాలా, బటిండా, హల్వారా , పఠాన్‌కోట్ ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. అలాగే హిమాచల్‌లోని భుంటార్, సిమ్లా, కాంగ్రా (గగ్గల్), చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం, జమ్మూ, శ్రీనగర్‌లోని లేహ్, రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్, జైసల్మేర్, జోధ్‌పూర్, బికనీర్ గుజరాత్‌లోని ముంద్రా, జామ్‌నగర్, హిరాసర్, పోర్‌బందర్, కేశోడ్, కాండ్లా, భుజ్ విమానాశ్రయాలను మూసి వేస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: మళ్లీ మొదలైన యుద్ధం.. పాకిస్థాన్ కాల్పులు

ఇది కూడా చూడండి: Pakistan: 'మా రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేయండి'.. పాక్‌లో ప్రజల తిరుగుబాటు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు