భారత్-పాకిస్థాన్ యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ ప్రభుత్వంపై అక్కడి ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు. సోషల్ మీడియాలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇండియన్ డ్రోన్లు పాక్లోకి ఎలా వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని స్థానికులు సీరియస్ అవుతున్నారు.
Also Read: భారత్-పాక్ మధ్య హైటెన్షన్.. తెలంగాణ సర్కార్ ప్రకటించిన టోల్ ఫ్రీ నంబర్లు ఇవే!
భారత్ దాడి విషయంలో అసలు నిజాలు బయటపెట్టడం లేదని మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదటగా మా రాజకీయ నేతలు ఉండే ఇళ్లపై దాడులు చేయాలని అక్కడి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.