/rtv/media/media_files/2025/04/14/2xHQINCcIKakfmSvY0g6.jpg)
PM Modi
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానాన్ని తాను సున్నితంగా తిరస్కరించానని ప్రధాని మోదీ వెల్లడించారు. బీహార్ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒడిశా చేరుకున్నారు. భువనేశ్వర్లో చేపట్టిన రోడ్ షోలో ప్రధాని పాల్గొన్నారు.
Also Read : ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం
ఒడిశా పర్యటనలో ఉన్న ఆయన.. ట్రంప్ ఆహ్వానంపై మాట్లాడారు. ‘‘జీ7 సదస్సు కోసం కెనడా వెళ్లినప్పుడు ట్రంప్ ఫోన్ చేశారు. వాషింగ్టన్ మీదుగా వెళ్లాలని సూచించారు. విందులో పాల్గొని చర్చించుకుందామని పిలిచారు. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు.. నేను చైతన్య మహాప్రభు తిరిగిన ప్రదేశానికి (ఒడిశా) వెళ్లడం నాకు చాలా ముఖ్యం.. అని నేను ట్రంప్తో చెప్పాను. ఆయన ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించా’’అని చెప్పారు. మహాప్రభువు పట్ల నాకున్న ప్రేమ, భక్తి నన్ను ఈ భూమికి తీసుకువచ్చాయి.” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Also Read: డీఎంకే కుటుంబంలో కలహాలు..ఆస్తి కోసం సోదరుల తగువులు
బీహార్ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి ఒడిశా భువనేశ్వర్లో చేపట్టిన రోడ్ షోలో ప్రధాని పాల్గొన్నారు. మోదీని దగ్గర నుంచి చూసిన ప్రజలు ఉత్సాహంతో ఉప్పొంగి పోయారు. మోదీ కాన్వాయ్పై పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా మోదీ ప్రజలకు అభివారం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం భువనేశ్వర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఒడిశా బీజేపీ ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుందన్నారు. ఈ వార్షికోత్సవం కేవలం ప్రభుత్వ వార్షికోత్సవం కాదని.. ఇది సుపరిపాలన స్థాపన వార్షికోత్సవం.. దీన్ని ప్రజాసేవ, ప్రజా విశ్వాసానికి అంకితం చేస్తున్నామని ప్రధాని తెలిపారు.
Also Read : ఏపీలో గంజాయి మత్తులో యువకులు వీరంగం.. సోషల్ మీడియాలో దృశ్యాలు వైరల్