/rtv/media/media_files/2025/06/19/sun-2025-06-19-23-42-59.jpg)
Sun Net Work
భారతదేశంలోని అతిపెద్ద మీడియా నెట్వర్క్లలో ఒకటి సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్. ఇది మొత్తం ఎప్పటి నుంచో డీఎంకే చేతుల్లోనే ఉంది. అయితే ఇప్పుడు ఈ విషయమై దాని యజమానుల మధ్య తగాదాలు వచ్చాయి. స్వయంగా అన్నదమ్ముల మధ్య చిచ్చు మొదలైంది. మాజీ కేంద్ర మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ తన సోదరుడు కళానిధికి లీగల్ నోటీసు పంపారు. సన్ నెట్ వర్క్ ఛైర్మన్ కళానిధి మారన్ మోసం,మనీలాండరింగ్ లతో మోసపూరిత పద్ధతులకు పాల్పడ్డారని దయానిధి ఆరోపించారు. కంపెనీ వాటాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
నన్ను మోసం చేశారు..దయానిధి మారన్
జూన్ 10న దయానిధి మారన్.. తన సోదరుడు కళానిధి మారన్, ఆయన భార్య కావేరి మారన్ సహా ఏడుగురికి లీగల్ నోటీసులు పంపించారు. చెన్నైలోనా లా ధర్మ కు చెందిన కె. సురేశ్ వీటిని అందించారు. కళానిధి మారన్, కావేరీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం సన్ నెట్ వర్క్ మొత్తాన్ని, దాని ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని దయానిధి మారన్ అంటున్నారు. కుటుంబ పరిస్థితులను ఆసరాగా చేసుకుని..తన తండ్రి మురుసోలి మారన్ ఆరోగ్యం బాలేనప్పుడు మోసానికి పాల్పడ్డారని చెప్పారు. తండ్రి మరణించిన తర్వాత సరైన పత్రాలు లేకుండానే షేర్లను బదిలీ చేశారని దయానిధి ఆరోపించారు. 2003 సెప్టెంబర్ 15న కళానిధి తనకు రూ.10 చొప్పున 12 లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించారని..అవి చాలా తక్కువ అని ఆయన అన్నారు. అప్పటి షేర్ల విలువ రూ.2500 నుంచి రూ.3000 వరకు ఉందని చెప్పారు. కానీ తనకు కేవలం రూ. 10 మాత్రమే లెక్క కట్టి ఇచ్చారని దయానిధి నోటీసులు మెన్షన్ చేశారు. దయానిధి మారన్ ప్రభుత్వ దర్యాప్తును సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) ద్వారా కోరతారని నోటీసులో చెప్పారు. దీంతో మరోసారి మారన్ కుటుంబం మధ్య వివాదాలు తెర మీదకు వచ్చాయి. సన్ టీవీలో ఎంకే దయాళు వాటాను 100 కోట్లకు కొనుగోలు చేయడం ద్వారా కరుణానిధి తమను మోసం చేశారని మారన్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే దయానిధి మారన్ పంపిన లీగల్ నోటీసులకు కళానిధి మారన్ స్పందించారో లేదో మాత్రం ఇంకా తెలియలేదు.