/rtv/media/media_files/2025/02/08/1XZKnV6ePuzPVugCToJm.jpg)
Delhi Longest Serving Female Chief Minister Sheila Dikshit special story
గాంధీ-నెహ్రూ కుటుంబానికి ముద్దుల కూతురు షీలా దీక్షిత్ (Sheila Dikshit). ఆమె 1998లో ఢిల్లీలో తమ తిరుగులేని ఆధిపత్యాన్ని స్థాపించారు. ఆమె దెబ్బకు చాలా మంది పెద్ద నాయకులు సైతం ఓడిపోగా 15 సంవత్సరాలు తిరుగులేని ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1998లో షీలా దీక్షిత్ నాయకత్వంలో కాంగ్రెస్ కు ఢిల్లీలో తిరుగులేకుండా పోయింది. దీక్షిత్ నాయకత్వంలో రాజధాని మెట్రో సేవలను ప్రవేశపెట్టడం, ఫ్లైఓవర్ల నిర్మాణంతోపాటు CNGని ప్రోత్సహించడం వంటి ప్రధాన నిర్ణయాలతో సహా అద్భుతమైన మార్పులను చూసింది.
Also Read : కుంభమేళాలో కాసుల వర్షం.. టీ అమ్ముతూ రోజుకు రూ.15వేలు, బొట్టు పెడుతూ రూ.20వేలు: ఐడియా అదుర్స్!
వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి..
1998 అసెంబ్లీ ఎన్నికల్లో షీలా దీక్షిత్ నాయకత్వంలో కాంగ్రెస్ (Congress) అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. కాంగ్రెస్ 52 సీట్లు గెలుచుకోగా బీజేపీ (BJP) కేవలం 15 సీట్లకు పరిమితమైంది. అయితే 1993 ఎన్నికలలో బీజేపీ 49 సీట్లు గెలుచి అధికారం చేపట్టినప్పటికీ వర్గపోరు, తప్పుడు నిర్ణయాల కారణంగా బీజేపీ బలహీనపడింది. దీంతో 1998లో షీలా దీక్షిత్ ప్రభావం చూపించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత ఢిల్లీలో అభివృద్ధికి పునాది వేశారు. ముఖ్యంగా రవాణా వ్యవస్థను మెరుగుపరచడంపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఢిల్లీ ముఖచిత్రంలో మార్పులు మొదలయ్యాయి. ఆమె వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. షీలా దీక్షిత్ నాయకత్వంలో కాంగ్రెస్ 1998, 2003, 2008 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించింది. 2003లో కాంగ్రెస్ 47 సీట్లు గెలుచుకోగా బీజేపీ 20 సీట్లకు పడిపోయింది. 2008లో కాంగ్రెస్ మళ్ళీ గెలిచి 43 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ కాలంలో ఢిల్లీ మెట్రో సర్వీస్ ప్రారంభం, ఫ్లైఓవర్ల నెట్వర్క్, CNG బస్సుల నిర్వహణ వంటి అనేక ప్రధాన మార్పులను చూసింది.
ఇది కూడా చదవండి: Delhi CM: ఢిల్లీ సీఎం ఎవరు ?.. రేసులో ఉంది వీళ్లే
ఐక్యరాజ్యసమితి కమిషన్ బాధ్యతలు..
ఆమె మామ ఉమా శంకర్ దీక్షిత్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ హోం మంత్రి కావడం ఆమెకు బాగా కలిసొచ్చింది. ఇందిరా గాంధీ ఆదేశం మేరకు షీలా దీక్షిత్ మహిళల స్థితిగతులపై ఐక్యరాజ్యసమితి కమిషన్ బాధ్యతలు స్వీకరించారు. దీని తరువాత 1984లో ఆమె ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ లోక్సభ స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఆమె 1986 నుండి 1989 వరకు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.
ఇది కూడా చదవండి: PM Modi: ఢిల్లీని గెలిచిన మోదీ.. నెక్ట్స్ టార్గెట్ ఈ రాష్ట్రాలే!
మోదీ ప్రభుత్వంలో రాజీనామా..
అయితే 2013 ఎన్నికలు ఆమెకు సవాలుగా మారాయి. అన్నా ఉద్యమం నుండి పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో న్యూఢిల్లీ స్థానం మారింది. 2013లో కేజ్రీవాల్ వేవ్లో భారీ తేడాతో కాంగ్రెస్ ఓడిపోయింది. 2013 తర్వాత ఆమె మాయాజాలం ఢిల్లీ, యూపీతో సహా కూడా పనిచేయలేదు. ఈ ఓటమి తర్వాత షీలా దీక్షిత్ ఢిల్లీ రాజకీయాలకు దూరమయ్యారు. యుపీఏ ప్రభుత్వం ఆమెను కేరళ గవర్నర్గా నియమించింది. కానీ 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. 2017లో యుపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆయనను ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా నిలబెట్టింది. కానీ పార్టీకి ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం చేకూర్చలేదు. ఆ తర్వాత షీలా దీక్షిత్ 2019లో మరణించారు. కానీ ఢిల్లీలో ఆమె తీసుకొచ్చిన మార్పులకుగానూ షీలాను ఢిల్లీ ప్రజానీకం ఎప్పటికీ మరిచిపోలేదు. ఆమె ఢిల్లీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతారు.
Also Read : ఓటీటీలో సుదీప్ కిచ్చా మ్యాక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?