Delhi Encounter: ఢిల్లీలో ఎన్‌కౌంటర్.. పోలీసులపై కాల్పులు!

ఢిల్లీలో ఎన్‌కౌంటర్ కలకలం రేపుతోంది. చావ్లాలో కాలా జాథేడి గ్యాంగ్‌, పోలీసులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. గ్యాంగ్‌స్టర్ అమిత్ డాగర్, అంకిత్‌ కాళ్లకు బుల్లెట్లు విడిచి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారు ఓం ప్రకాష్ కోసం పనిచేస్తున్నట్లు చెప్పారు.

New Update
US Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు..నలుగురు మృతి..!!

Delhi Encounter Kala Jathedi gang and police

ఢిల్లీలో ఎన్‌కౌంటర్ కలకలం రేపుతోంది. చావ్లా ప్రాంతంలో కాలా జాథేడి గ్యాంగ్‌, పోలీసులకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ ఓం ప్రకాష్ అలియాస్ కాలా సోదరుడు అమిత్ డాగర్, అతని సహచరుడు అంకిత్ కదలికలపై సమాచారం అందగానే అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లారు. దీంతో దుండగులు పోలీసులపై కాల్పులు జరపగా వారిపై ఎదరుదాడి చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.

Also Read :  అమెరికాలో తాగుబోతు బీభత్సం.. భారతీయ తండ్రీకూతుళ్లను కాల్చి చంపాడు

పేరుమోసిన నేరస్థులు..

ఈ మేరకు శనివారం పోలీసు బృందం ఆ ఇద్దరు పేరుమోసిన నేరస్థులను చుట్టుముట్టింది. ఇది గమనించి నేరస్థులు పోలీసులపై కాల్పులు ప్రారంభించారు. పోలీసులు కూడా వారిపై కాల్పులు జరపడంతో ప్రతిగా కాల్పులు జరిపారు. ఇందులో ఇద్దరు నిందితుల కాళ్లకు బుల్లట్లు తగిలాయి. వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకుని, ప్రాథమిక చికిత్స చేయించి, కస్టడీలో తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. అయితే ఆ నిందితులు కాలా జాతేడి ముఠాలోని సభ్యులుగా పోలీసులు గుర్తించారు. ఆ ముఠాలోని ఇతర సభ్యులను, వారి కార్యకలాపాలను గుర్తించడానికి తదుపరి దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఐదు రోజుల క్రితం కూడా ఢిల్లీ పోలీసులు కాలా జాతేడీ ముఠాకు చెందిన ముగ్గురు షూటర్లను అరెస్టు చేశారు. ద్వారక ప్రాంతంలో ఇటీవల జరిగిన రెండు కాల్పుల ఘటనల్లో ఈ ముగ్గురూ పాల్గొన్నట్లు వెల్లడించారు. 

Also Read :  తల్లి డైరెక్షన్‌.. కొడుకులు యాక్షన్‌.. షేక్​ పేట చోరీ కేసులో బిగ్‌ట్విస్ట్‌

పోలీసులపై కాల్పులు..

నిందితులను మోహిత్ అలియాస్ షూటర్, మనీష్ అలియాస్ హాతి, ప్రవీణ్ అలియాస్ టోనాగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ ఓం ప్రకాష్ అలియాస్ కాలా సూచనల మేరకు పనిచేస్తున్నారు. మార్చి 16న ముగ్గురు దుండగులు నజాఫ్‌గఢ్‌లోని వినోబా ఎన్‌క్లేవ్‌లోని ఒక వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులు జరిపారు. యాదృచ్చికంగా, ఆ సమయంలో ఆ వ్యాపారవేత్త ఇంట్లో లేడు. దీని తరువాత నిఘా సమాచారం ఆధారంగా మోహిత్, మనీష్ బాబా హరిదాస్ నగర్ ప్రాంతానికి రాబోతున్నారని తెలిసింది. మహేష్ గార్డెన్ సమీపంలో పోలీసు బృందం వారిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు తప్పించుకునే ప్రయత్నంలో వారిద్దరూ పోలీసులపై కాల్పులు జరిపారు. ప్రతీకారంగా పోలీసులు వారిద్దరినీ కాళ్లపై కాల్చి పట్టుకున్నారని తెలిపారు.

Also read :  గువాహటి ఐఐటీ పరిశోధకుల అద్బుతం.. అంతర్జాతీయ సరిహద్దులపై రోబోల నిఘా ! 

delhi

గత సంవత్సరం మార్చిలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ సందీప్ అలియాస్ కాలా జాతేడి, లేడీ డాన్ అనురాధ చౌదరి వివాహం చేసుకున్నారు. ఈ వివాహం కోసం ఢిల్లీ కోర్టు గ్యాంగ్‌స్టర్‌కు 6 గంటల కస్టడీ పెరోల్ ఇచ్చింది. మార్చి 14న గృహప్రవేశం కోసం అతనికి 6 గంటల పెరోల్ కూడా లభించింది. కానీ తరువాత కోర్టు దానిని రద్దు చేసింది. మార్చి 12న ఢిల్లీలోని సంతోష్ గార్డెన్‌లో జరిగిన ఈ వివాహంలో ప్రతి ఆచారం కోర్టు ఇచ్చిన సమయానికి అనుగుణంగా జరిగింది. ఈ సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో అక్కడకు వెళ్లారు. 

Also Read :  ఆస్పత్రికి అల్లు అర్జున్... టెన్షన్ లో అల్లు ఫ్యామిలీ

gangster | telugu-news | today telugu news | latest-telugu-news | encounter | national news in Telugu | telugu crime news

Advertisment
Advertisment
తాజా కథనాలు