Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. శీష్‌మహల్ విచారణకు ఆదేశం

కేజ్రీవాల్‌ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ భవనం మరమ్మతులో భాగంగా అవినీతికి పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(CVC) దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

New Update
Sheesh Mahal and Arvind Kejriwal

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections 2025) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరో చిక్కులో పడ్డారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ భవనంలో అవినీతికి పాల్పడి, అక్రమ నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(CVC) దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీలో మాజీ విపక్ష నేత రోహిణి, ఎమ్మెల్యే విజేంద్రగుప్తా ఫిర్యాదు మేరకు సీవీసీ చర్యలకు దిగింది. 

Also Read: మద్యం సేవించే మహిళలు ఏ రాష్ట్రంలో ఉన్నారో తెలుసా ?

Big Shock To Arvind Kejriwal

శీష్‌ మహల్‌( అద్దాల మేడ, సీఎం అధికారిక నివాసానికి బీజేపీ పెట్టిన పేరు) అంశం ఎన్నికల ముందు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ అంశంపై విజేంద్ర గుప్త 2024 అక్టోబర్ 14న సీవీసీకి ఫిర్యాదు చేశారు. 8 ఎకరాల విస్తీర్ణంలో శీష్‌ మహాల్‌ నిర్మించేందుకు అరవింద్ కేజ్రీవాల్ భవన నిర్మాణ నిబంధనలు ఉల్లంఘించారని ఆయన ఫిర్యాదులో చెప్పారు. ఈ క్రమంలో 2024, అక్టోబర్ 16న సీవీసీ దీనిపై విచారణ ప్రారంభించింది. 2025 ఫిబ్రవరి 13న దీనిపై అందిన నివేదికను పరిశీలించిన తర్వాత.. ఈ అంశంపై మరింత వివరణాత్మక దర్యాప్తు నిర్వహించాలని సంబంధిత ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే తాజాగా సీవీసీ మరోసారి విచారణకు ఆదేశించింది. 

Also Read: రండి.. రండి.. పానీ పూరీ తింటే రూ.21 వేల ప్రైజ్‌మనీ.. ఎగబడుతున్న కస్టమర్స్!

సీఎం అధికారిక నివాసం, దాని పునరుద్ధరణ కోసం జరిగిన వృధా ఖర్చుపై చర్యలు తీసుకోనున్నారు. ఈ నివాసానికి మరమ్మతులు చేపట్టేందుకు కేజ్రీవాల్‌ రూ.80 కోట్ల ప్రజాధనాన్ని వినియోగించినట్లు బీజేపీ నేత విజేందర్ గుప్తా సీవీసీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. శీష్‌మహల్‌లోని టాయిలెట్‌లో గోల్డెన్ కమోడ్, స్విమ్మింగ్‌పూల్ అలాగే మినీ బార్‌ వంటివి ఏర్పాట్లు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ బంగ్లాకు మరమ్మతులు చేపట్టడంలో అనేక అవకతవకలు జరిగాయన్నారు. ఈ క్రమంలోనే సీవీసీ దీనిపై విచారణకు ఆదేశించింది. 

Also Read: డేంజర్ జోన్‌లో ఇండియా.. అణబాంబు కంటే 500 రెట్ల వినాశనం!

Also Read :  జమ్మూ కాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు