2024 YR4: డేంజర్ జోన్‌లో ఇండియా.. అణబాంబు కంటే 500 రెట్ల వినాశనం!

2024 YR4 గ్రహశకలం అంతరిక్షంలో భూమివైపు దూసుకొస్తోంది. వెడల్పు 100 మీటర్లు. ఇది 2032 డిసెంబర్‌లో ఇండియాతోపాటు మరో 8 దేశాలపై పడే అవకాశం ఉంది. గంటకు 38000 కి.మీ స్పీడ్‌తో 2024 YR4 ప్రయాణిస్తోంది. భూమిని తాకితే అణుబాంబు కంటే 500 రెట్లు విధ్వంసం సృష్టిస్తుంది.

author-image
By K Mohan
New Update
2024 YR4

2024 YR4 Photograph: (2024 YR4)

భూమి అంతమైపోతుంది. కలియుగం నాశనం కాబోతుందని ఇప్పటి వరకు చాలా వార్తలు.. మరికొన్ని పుకార్లు ఎన్నో వచ్చాయి. కానీ ఇప్పుడు చెప్పబోయేది మాత్రం నిజం.. ఎందుకంటే నాసా సైంటిస్టులే ఈ అలర్ట్ జారీ చేశారు. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇండియాతోపాటు మరో 9 దేశాలు డేంజర్ జోన్ లో ఉన్నాయని నాసా అలెర్ట్ చేసింది. ప్రమాదం ముంచుకొస్తోంది. విశ్వంలో ఓ పెద్ద గ్రహశకలం భూమివైపుకే దూసుకొస్తోంది. ఈ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొంటే హిరోషిమా నాగసాకిపై వేసిన అణుబాంబుల కంటే 500 రెట్లు ఎక్కువ విధ్వంసం జరుగుతుంది. గ్రహశకలం పడ్డ 50 కిలో మీటర్ల సరోండింగ్స్‌లో ఉన్న ప్రతిదీ కాలి బూడిదైపోతుంది. ఇది భూమిని తాకితే సుమారు 8 మిలియన్ టన్నుల TNT పవర్ విడుదల అవుతుంది. ఒక టీఎన్టీ అంటే 4.184 గిగాజౌల్స్ పవర్ రిలీజ్.

నాసా కాటాలినా స్కై సర్వే ప్రాజెక్ట్‌లో ఇంజనీర్ డేవిడ్ రాంకిన్‌తోపాటు మరి కొంతమంది నిపుణులు ఈ గ్రహశకలం భూమిని ఢీకొంటే ఎక్కడ పడే అవకాశం ఉందో అంచనా వేశారు. వారి ప్రకారం.. ఈ గ్రహశకలం ఉత్తర దక్షిణ అమెరికా నుంచి పసిఫిక్ మహాసముద్రం, దక్షిణాసియా, అరేబియా సముద్రం మరియు ఆఫ్రికా వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో ఎక్కడో పడవచ్చు. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇథియోపియా, సూడాన్, నైజీరియా, వెనిజులా, కొలంబియా, ఈక్వెడార్ వంటి దేశాలు దీని పరిధిలో ఉన్నాయి. అంటే ఇది భారతదేశంలోని ఏ నగరంపైనా పడవచ్చు.

2024 YR4 అనే గ్రహశకలం అంతరిక్షం నుంచి భూమివైపు వస్తోంది. దీని వెడల్పు 100 మీటర్ల వరకు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది డిసెంబర్ 2032లో భూమిని ఢీకొనే అవకాశం ఉంది. గంటకు 38000 కిలో మీటర్ల స్పీడ్‌తో 2024 YR4 భూగ్రహంవైపు దూసుకొస్తోంది. అది భూమిని తాకితే విధ్వంసం సృష్టిస్తోంది. ఈ ప్రమాదం డ్రాగన్ కంట్రీకి కూడా పొంచి ఉంది. అందుకే చైనా ముందుగానే అప్రమత్తమైంది.

ఇది కూడా చదవండి: Kiran-Laxmi: పవన్ అండతోనే కిరణ్ రాయల్ అరాచకాలు.. సంచలనాలు బయటపెట్టిన లక్ష్మి!

2024 YR4 భూమిని ఢీకొనకుండా రూట్ మార్చడానికి చైనా విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ఖగోళ శాస్త్రవేత్తలను రంగంలోకి దింపింది. గతంలో ఇది భూమిని తాకే అవకాశం 1.3 శాతం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు2.3 శాతంగా మారింది. ప్రస్తుతం ఈ ఆస్ట్రరాయిడ్ వేల కిలో మీటర్ల దూరంలో ఉంది. 2029లో అపోఫిస్ అనే మరో గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని అంచనా వేశారు. కానీ తర్వాత అది దాని దిశను మార్చుకొంది. ఇప్పుడు అది భూమికి దగ్గరగా వెళుతుందని కానీ ఎర్త్‌కు క్రాష్ అవ్వదని సైంటిస్టులు చెబుతున్నారు. అయినప్పటికీ, నాసాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు దీనిపై నిఘా పెట్టారు. ఇప్పుడు 2024 YR4కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు