KARREGUTTA : కర్రెగుట్టలో కొనసాగుతున్న కూంబింగ్...స్పాట్ లో వేలాదిమంది మావోయిస్టులు

ఆపరేషన్ కగార్ లో భాగంగా కీలకమైన కర్రెగుట్ట ను స్వాధీనం చేసుకునేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఏడు రోజులుగా కూంబింగ్ జరుగుతోంది.  ఈ గుట్టల్లో సుమారు 1000మంది మావోయిస్టులు ఉన్నట్లు బలగాలకు సమాచారం ఉండడంతో గాలింపు ముమ్మరం చేశాయి.

New Update
Operation Karre Gutta

Operation Karre Gutta

ఆపరేషన్ కగార్ లో భాగంగా కీలకమైన కర్రెగుట్ట ను స్వాధీనం చేసుకునేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఏడు రోజులుగా కూంబింగ్ జరుగుతోంది.  ఈ గుట్టల్లో సుమారు 1000మంది మావోయిస్టులు ఉన్నట్లు బలగాలకు సమాచారం KARREGUTTA : ఉండడంతో గాలింపు ముమ్మరం చేశారు. పదివేల మందితో కూడిన భద్రతా దళాలు ఈ కూంబింగ్‌లో పాల్గొంటున్నాయి. కర్రెగుట్టలో 100 కు పైగా సొరంగాలు, గుహలు ఉన్నట్లు భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఈ గుహలు బలగాలకు సవాల్‌గా మారాయి. 

ఇది కూడా చూడండి: Russia: రష్యా సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటన

Combing Operation Underway In Karregutta

గుట్ట చుట్టూ మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను నిర్వీర్యం చేసుకుంటూ బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటివరకు 112 ఎల్‌ఈడీ బాంబులను బలగాలు నిర్వీర్యం చేశాయి. మావోలు ప్రెషర్‌ కుక్కర్‌ బాంబులతో బలగాలకు సవాల్‌ విసురుతున్నారు. మరోవైపు విపరీతమైన ఎండలు దళాలకు తీవ్ర ఇబ్బందిగా మారాయి. -- 3 బేస్ క్యాంపులతో భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. మరోవైపు -- డ్రోన్లు, హెలికాప్టర్లతో సెర్చింగ్ ఆఫరేషన్‌ను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆపరేషన్ కగార్ నిలిపివేయాలంటూ మావోలు కోరుతున్నారు.  శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి మరోసారి లేఖ విడుదల చేశారు.

ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

ఛత్తీస్‌గఢ్‌ -తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో భద్రతా దళాల కూంబింగ్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న కర్రెగుట్టల్లో వారి రహస్య స్థావరాల్లోకి భద్రతా బలగాలు చొచ్చుకెళ్లాయి.  గుట్టలో శనివారం భారీ సొరంగాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. ఒక్కొక్కరే వెళ్లగలిగేలా ఉన్న ఈ రాతి సొరంగం మార్గంలో దాదాపు 80 అడుగులు లోపలికి వెళ్లిన కోబ్రా, సీఆర్ఫీఎఫ్‌ బలగాలు విశాలంగా ఉన్న ప్రాంతాన్ని గుర్తించాయి. లోపల అనుబంధంగా మరో నాలుగు గుహలు ఉన్నట్లు నిర్ధారించాయి.ఇక్కడ దాదాపు వెయ్యి మంది ఆశ్రయం పొందవచ్చని ఆనవాళ్ల బట్టి అంచనా వేశారు.

ఇది కూడా చూడండి:Waqf Board Assets: వక్ఫ్‌ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్రం కీలక ప్రకటన

శనివారం అర్ధరాత్రి నుంచి ఆయా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ఆపరేషన్‌కు కొంత ఆటంకం ఎదురైంది. తరువాత వెంకటాపురం మండలంలోని తాపాల నిచ్చెన మీదుగా కర్రెగుట్టల్లోకి బలగాలు చొచ్చుకెళ్లాయి. చెలిమల, ముకునూరు అరణ్యంలో కూంబింగ్‌ను నిర్వహిస్తూ ముందుకు సాగాయి.  

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం ఉగ్రదాడిలో కీలక పరిణామం..జిప్ లైన్ ఆఫరేటర్ పై ఎన్ఐఏ ఫోకస్

maoists news | maoists | stop opretation kagar | operation kagar in chathisghad | operation kagar

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు