/rtv/media/media_files/2025/09/06/cm-siddaramaiah-car-2025-09-06-14-50-09.jpg)
CM Siddaramaiah's official car booked for 7 traffic violations
కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ట్రాఫిక్ చలానాలపై వాహనదారులకు ఊరట కల్పించిన సంగతి తెలిసిందే. ఏకంగా 50 శాతం డిస్కౌంట్తో స్కీమ్ను ప్రకటించింది. వీటికి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర అప్డేట్ వెలుగులోకి వచ్చింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రయాణించే కారుపై కూడా చలానాలు ఉన్నాయి. దీంతో ఈ స్కీమ్తో ఉన్న 50 శాతం డిస్కౌంట్తో జరిమానాలు కట్టేశారు. అయితే సిద్ధరామయ్య ప్రయాణించే కారు ట్రాఫిక్లో ఏడుసార్లు ఉల్లంఘనలకు పాల్పడింది.
Also Read: ఏకంగా ఎర్రకోటపైనే కన్నేసిన దొంగలు.. విలువ చేసే కలశం మాయం.. ఎన్ని కోట్లంటే?
Respected @CMofKarnataka@siddaramaiah sir,
— *ಆರ್ ಸಿ ಬೆಂಗಳೂರು | RC Bengaluru* (@RCBengaluru) September 3, 2025
Pending traffic violations on your official car..
Speeding, Not wearing seat belt..
Hope fines will be cleared.. btw.. 50% rebate is ON till 12/09
Be a #RoadSafety ambassador 👍
Safety first is our motto 🙏 https://t.co/yH8Ol017svpic.twitter.com/kXEIsdLVZh
Also Read: గొప్ప ప్రధాని అనడాన్ని అభినందిస్తున్నా..ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందన
వీటిలో కారు సీటుబెల్ట్ ధరించనందుకే ఆరుసార్లు చలానా పడింది. అలాగే అతివేగంతో వెళ్లినందుకు ఒకసారి జరిమానా విధించారు. ముఖ్యమంత్రి కారుకు ఉన్న చలానాలు చెల్లించలేదని ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే సీఎం యంత్రాంగం డిస్కౌంట్ స్కీమ్ ద్వారా చెల్లించింది. ఈ చలానాలకు రాయితీ పోగా మొత్తం రూ.8750 చెల్లించింది.
CM Siddaramaiah Government Car Traffic Fine: ಸೀಟ್ ಬೆಲ್ಟ್ ಹಾಕದ ಸಿಎಂಗೆ 2,500 ಸಾವಿರ ದಂಡ! #CmGovermentCar#CmCarTrafficFine#TrafficFines#Siddaramaiah#TrafficViolationCases#Bengaluru#PoliticalNews#PoliticalUpdates#KannadaNewspic.twitter.com/P9uBqPf4Yt
— TV9 Kannada (@tv9kannada) September 6, 2025
Also Read: పాకిస్తాన్ కరాచీలో ఘనంగా గణేష్ నిమజ్జనాలు.. గణపతి విగ్రహాలతో కళకళలాడుతున్న వీధులు!
చలానా రాయితీ స్కీమ్ కింద వాహనాదారులు సగం కడితే మిగతా మొత్తాన్ని కర్ణాటక ప్రభుత్వం మాఫీ చేస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 21 ఈ పథకాన్ని ప్రారంభించింది. సెప్టెంబర్ 19 వరకు మాత్రమే ఇది అమల్లో ఉండనుంది. ఈ రాయితీ స్కీమ్ తీసుకురావడం వల్ల ఇప్పటిదాకా వాహనాదారుల నుంచి రూ.40 కోట్లు వసూలైనట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.
Also Read: గణపతి నిమజ్జనం రోజు వర్షం పడటం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏంటో మీకు తెలుసా?