Delhi: ఏకంగా ఎర్రకోటపైనే కన్నేసిన దొంగలు.. విలువ చేసే కలశం మాయం.. ఎన్ని కోట్లంటే?

ఢిల్లీ ఎర్రకోట పార్కులో జైన మత కార్యక్రమం సందర్భంగా ఉపయోగించిన కలశాన్ని గుర్తు తెలియని దుండగులు దొంగతనం చేశారు. 760 గ్రాముల బంగారం, 150 గ్రాముల వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలు పొదిగి ఉన్న ఈ కలశం చోరీ భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జరిగిందని తెలుస్తోంది.

New Update
Delhi red fort

Delhi red fort

ఢిల్లీలోని ఎర్రకోటలో భారీ దొంగతనం జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఎర్రకోట పార్కులో జైన మత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత ఓ ప్రత్యేకమైన కలశం కనిపించడం లేదు. దొంగతనం జరిగినట్లు తాజాగా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ వ్యాపారవేత్త అయిన సుధీర్ జైన్ డైలీ పూజ నిర్వహించడం కోసం ఓ ప్రత్యేకమైన కలశాన్ని తీసుకొచ్చేవారు. ఈ కలశ పూజ ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు కొనసాగుతాయి. దీంతో దొంగలు పక్కా ప్లానింగ్‌తో ఈ విలువైన కలశాన్ని కొట్టేశారు.

విలువైన కలశం మాయం..

ఎర్రకోట వద్ద దగ్గర ఉన్న భద్రత సిబ్బందిని బురిడి కొట్టించి మరి దొంగతనం చేశారు. ఈ కలశం మొత్తం బంగారం, వెండితో తయారు చేసినది. ఈ కలశంలో 760 గ్రాముల బంగారం, 150 గ్రాముల వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలు పొదిగి ఉన్నాయని తెలుస్తోంది. ఇంత విలువైన కలశం దొంగతనం జరగడంతో ఎర్రకోట వద్ద ఉన్న భద్రతా లోపం ఎలా ఉందో తెలుస్తోంది. వారి నిర్లక్ష్యం వల్లనే ఈ దొంగతనం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే దుండగుడిని పట్టుకుంటామని తెలిపారు.

ఇది కూడా చూడండి:Ganesh Nimajjanam 2025: వినాయక నిమజ్జనాల్లో అపశ్రుతి.. క్రేన్ తెగి పడి ఇద్దరు.. నీటిలో కొట్టుకుపోయి మరికొరు..!

ఇదిలా ఉండగా ఆగస్టు 2న కూడా ఎర్రకోటలో భద్రతా లోపం ఏర్పడింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం పోలీసులు ఒక మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ డ్రిల్‌లో స్పెషల్ సెల్ బృందం సాధారణ దుస్తుల్లో వచ్చి వారితో ఒక నకిలీ బాంబును ఎర్రకోటలోకి తీసుకెళ్లారు. ఆ బాంబును భద్రతా సిబ్బంది అసలు గుర్తించలేదు. కొందరి నిర్లక్ష్యం కారణంగా జరగడంతో కొంతమంది పోలీసులను సస్పెండ్ చేశారు. ఇప్పుడు మళ్లీ ఈ భారీ దొంగతనం జరగడంతో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు