Char Dham Yatra: నేటి నుంచే చార్ ధామ్ యాత్ర ప్రారంభం

చార్ ధామ్ యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. నేడు యమునోత్రి, గంగ్రోతి ఆలయాలు తెరుచుకుంటాయి. మే 2వ తేదీన కేధార్‌నాథ్, మే 4వ తేదీన బద్రీనాథ్ ద్వారాలను ఓపెన్ చేస్తారు. పహల్గాం ఉగ్రదాడితో చార్ ధామ్‌లో భద్రత పరంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

New Update
Char Dham Yatra

Char Dham Yatra

ఎందరో భక్తులు ఎదురు చూసే చార్ ధామ్ యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. లక్షల మంది భక్తులు ఈ యాత్రకు వెళ్తుంటారు. అయితే చార్ ధామ్‌లో భాగంగా మొదట గంగోత్రి, యమునోత్రి తలుపులు తెరుస్తారు. ఆ తర్వాత మే 2వ తేదీన కేధార్‌నాథ్, మే 4వ తేదీన బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్ చేస్తారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు చార్ ధామ్‌ యాత్రకు 20 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 

ఇది కూడా చూడండి: Jammu and Kashmir: లోయలో పడిపోయిన CRPF జవాన్ల వాహనం

ఇది కూడా చూడండి: Akshaya Tritiya 2025 నేడు అక్షయ తృతీయ.. బీరువాలో ఈ ఒక్కటి ఉంచితే డబ్బులే డబ్బులు

ఉగ్రదాడి భయంతో..

కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి భద్రతను కూడా పెంచారు. ఎందుకంటే ఈ యాత్రలో కూడా దాడి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని దేవాలయాలు, ప్రయాణ మార్గంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదనపు పోలీసు బలగాలను మోహరించారు.

ఇది కూడా చూడండి: DC VS KKR: డూ ఆర్ డై మ్యాచ్ లో ఢిల్లీ ఓటమి..14 పరుగుల తేడాతో కోలకత్తా విజయం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు