/rtv/media/media_files/2025/04/20/14B5xUzYUqHzaam5SRcI.jpg)
bride mother sits on wedding benche with Groom in Uttar Pradesh
Fake Marriage: రోజు రోజుకూ మోసాలు పెరిగిపోతున్నాయి. నమ్మిన వారే ఎక్కువగా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. తమ్ముడికి పెళ్లి చేస్తున్న అన్నా వదినలు భారీ మోసానికి పాల్పడ్డారు. వధువు కుటుంబంతో కలిసి కుమ్మక్కయ్యారు. దీంతో పెళ్లి పీటలపై వధువుకు బదులు, వధువు తల్లిని కూర్చోబెట్టారు.
Also Read: TS: తెలంగాణ యువతకు జపాన్ లో ఉద్యోగాలు..సీఎం రేవంత్ ఒప్పందాలు
అనుమానం వచ్చిన ఆ వరుడు.. ముసుగు తీసి చూడగా ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఆ పెళ్లి పీటలపై వధువుకు బదులు ఆమె తల్లి ఉండటంతో ఖంగుతిన్నాడు. తాను మోసపోయానని గుర్తించిన ఆ వరుడు తిన్నగా పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: Woman Elopes: 43ఏళ్ల వయసులో ఇదేం పని ఛీఛీ.. వీయ్యంకుడితో లేచిపోయిన మహిళ
షాకింగ్ ఇన్సిడెంట్
ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మేరఠ్లో జరిగింది. బ్రహ్మపురికి చెందిన 22 ఏళ్ల మొహమ్మద్ అజీంకు.. శామలీ జిల్లా వాసి 21 ఏళ్ల మంతశాతో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి పనులు గ్రాండ్గా ఏర్పాటు చేశారు. ఇరు కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువుల మధ్య పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. పెళ్లి పీటలపై వధువు, వరుడు కూర్చున్నారు.
అదే సమయంలో పెళ్లి కూతురి పేరు మంతశా అని కాకుండా ‘తాహిరా’ అని పలకడంతో వరుడు అజీంకు అనుమానం కలిగింది. దీంతో వెంటనే ముసుగు తీసి చూడగా.. ఆమె వధువు తల్లి అని తెలిసి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. భర్త చనిపోయిన 45 ఏళ్ల మహిళ వధువు వేషంలో కూర్చుని ఉండటంతో షాక్ అయ్యాడు. ఈ విషయంలో వరుడి తరఫున పెళ్లి పెద్దలుగా ఉన్న అన్నావదినలు వధువు ఫ్యామిలీతో కుమ్మక్కయ్యారు.
Also Read: Hydra: TDP ఎమ్మెల్యేకు హైడ్రా షాక్.. 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేత
దీంతో వారు వరుడు అజీంను వెంటనే బెదిరించారు. అల్లరి చేస్తే రేప్ కేసులో ఇరుక్కోవలసి వస్తుందని భయపెట్టారు. కానీ వరుడు అజీం అవన్నీ లెక్కచేయకుండా.. తాను మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన పెళ్లికి రూ. 5లక్షలు ఖర్చు పెట్టానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read: TS: తెలంగాణ యువతకు జపాన్ లో ఉద్యోగాలు..సీఎం రేవంత్ ఒప్పందాలు
crime | groom | bride | Fake Marriages | viral-news | latest-telugu-news | telugu-news