Woman Elopes: 43ఏళ్ల వయసులో ఇదేం పని ఛీఛీ.. వీయ్యంకుడితో లేచిపోయిన మహిళ

కూతురి మామగారితో మహిళ లేచిపోయింది. 43ఏళ్ల వయసులో మమత 46ఏళ్ల వీయ్యంకుడైన శైలేంద్రతో ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. మమత భర్త లారీ డ్రైవర్. ఏడాది నుంచి మమత, శైలేంద్ర మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది. 

New Update
Woman Elopes

వావి వరసలకు పిండం పెట్టి, తల్లిదండ్రుల బాధ్యత మరిచిన ఓ జంట. బహుశా ఇలాంటి ఘటన ఇంకెక్కడా జరిగుండకపోవచ్చు. వరసకు అతడు ఆమెకు అన్న. అతనితో వివాహేత సంబంధ పెట్టుకుంది ఓ మహిళ. పెళ్లి సంబంధం కలుపుకున్న వీయ్యంకుడితోనే అక్రమ సంబంధం కూడా కలుపుకుంది. ఆమె వయసు 43ఏళ్లు.. ఆయన వయసు 46ఏళ్లు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. కూతురి మామగారితో కలిసి మమత అనే మహిళ పారిపోయింది. ఇంట్లోని నగలు, నగదు, ఇతర విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లింది. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పారిపోయిన వియ్యంకుడు, వియ్యపురాలి కోసం వెతుకుతున్నారు. 

Also read: Hydra: TDP ఎమ్మెల్యేకు హైడ్రా షాక్.. 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేత

43 ఏళ్ల మమతకు నలుగురు పిల్లలు. ఆమె భర్త లారీ డ్రైవర్‌. దీంతో అతడు చాలా కాలం ఇంటికి దూరంగా ఉండేవాడు. ఈ క్రమంలోనే కుమార్తె మామగారైన శైలేంద్రతో మమతకు వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త లేనప్పుడు వీయ్యంకుడైన శైలేంద్రను ఇంటికి పిలిపించేది.

Also read: Jwalapuram: ఇండియా చరిత్ర మార్చబోతున్న జ్వాలాపురం.. 74వేల ఏళ్ల క్రితంనాటి ఆనవాళ్లు

ఏప్రిల్‌ 11న శైలేంద్రకు మమత ఫోన్‌ చేసింది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న డబ్బు, నగలు, విలువైన వస్తువులను తీసుకుని అతడితో కలిసి లేచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న మమత భర్త శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు.

(father in law | latest-telugu-news | extramarital-affair | uttara-pradesh)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు