Bomb Threat: ఆ స్టేడియాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపులు

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న హోల్కర్‌ స్టేడియాన్ని పేల్చేస్తామని బాంబు బెదిరింపులు వచ్చాయి. తనిఖీలు చేపట్టగా ఎలాంటి వస్తువులు కనిపించలేదు. ఇలా బెదిరించినవాళ్లపై కఠినంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

New Update
Bomb threat to Indore stadium over 'Operation Sindoor' turns out hoax

Bomb threat to Indore stadium over 'Operation Sindoor' turns out hoax

భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని క్రికెట్‌ స్టేడియానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండోర్‌లో ఉన్న హోల్కర్‌ స్టేడియాన్ని పేల్చేస్తామని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) కార్యదర్శికి ఈమెయిల్‌ వచ్చింది. దీంతో వెంటనే క్రికెట్ అసోసియేషన్ అప్రమత్తమైంది. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చింది. 

Also Read: పాక్‌ దాడిలో చనిపోయిన కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

పోలీస్ బృందాలు, బాంబు స్క్వాడ్‌లు హోల్కార్‌ స్డేడియానికి వచ్చారు. స్టేడియం ప్రాంగణాన్ని దాదాపు 5 గంటల వరకు క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే తమకు ఎలాంటి అనుమానస్పద వస్తువులు దొరకలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు. సైబర్‌ స్క్వాడ్‌తో కలిసి ఫేక్ ఈమెయిల్‌ మూలాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఇలా బెదిరించినవాళ్లపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

Also Read: ఎయిర్‌ రైడ్‌ సైరన్‌లను మీడియాలో చూపించొద్దు.. కేంద్రం కీలక ప్రకటన

ఇదిలాఉండగా ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌పై పాకిస్థాన్‌ డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. వీటిని మన భారత సైన్యం కూడా తిప్పికొడుతుంది. మరోవైపు తాజాగా భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి మళ్లీ ఎప్పుడైన భారత్‌లో ఉగ్రదాడి జరిగితే.. దేశంపై చేస్తున్న యుద్ధంగానే భావిస్తామని వార్నింగ్ ఇచ్చింది. అలాగే దీనికి భారత్ కూడా వెంటనే స్పందించి చర్యలకు దిగుతుందని స్పష్టం చేసింది. 

Also Read: దాడులు ఆపితే ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధం.. పాక్ కాళ్ల భేరం!

Also Read: ఆపరేషన్ సిందూర్‌...ఐదుగురు పాకిస్తానీ ఉగ్రవాదులు హతం!

 telugu-news | rtv-news | Indian Army | national-news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు