/rtv/media/media_files/2025/02/28/ca235hP3uvytYuqlqemG.jpg)
goa tourism Photograph: (goa tourism)
Goa Tourism: గోవా టూరిజం పతనం కావడానికి ఇడ్లీ, సాంబార్ కారణమని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో అన్నారు. వీటితోపాటు వడా పావ్లు కూడా విక్రయించడం వల్లే విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గిందని మండిపడ్డారు. ఇతర ప్రాంతాల వారికి గోవా వాసులు దుకాణాలు అద్దెకు ఇవొద్దన్నారు.
బీచ్ దుకాణాల్లో వడా పావ్లు..
ఈ మేరకు నార్త్ గోవాలోని కలంగూట్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే మైఖేల్ లోబో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. బీచ్లో ఇడ్లీ-సాంబార్, వడా పావ్ల అమ్మకాల వల్లే విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గింది అన్నారు. ‘బెంగళూరు నుంచి వచ్చిన వ్యాపారులు బీచ్ లో ఇడ్లీ-సాంబార్, వడా పావ్లు అమ్ముతున్నారు. దీంతో గత రెండేళ్లుగా గోవాకు విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గింది. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు’ అని మైఖేల్ చెప్పారు.
Also Read: వాహనాలకు ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇది లేకుంటే కేసు ఫైల్, బండి సీజ్!
మరోవైపు యుద్ధం కారణంగా ఉక్రెయిన్, రష్యా పర్యటకులు కూడా గోవాకు రావడం మానేసినట్లు తెలిపారు. గోవాలో విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గడానికి ప్రభుత్వం కారణం కాదు. దీనికి అందరూ బాధ్యులే. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి గోవా వాసులు తమ దుకాణాలను అద్దెకు ఇవ్వకూడదు. టూరిజం వెనకబడటానికి కారణాలేంటో టూరిజం శాఖతో సహా భాగస్వామ్య పక్షాలు చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ట్యాక్సీ, క్యాబ్ల సమస్యలను పరిష్కరించాలన్నారు.
Also Read: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!
u