/rtv/media/media_files/2025/02/19/TsdMF5LRX46K6u1kLxjC.jpg)
PVR INOX
2023లో బెంగళూరు (Bengaluru) కు చెందిన ఓ వ్యక్తి సాయంత్రం ఆరు గంటల షోకు అక్కడి పీవీఆర్ ఐనాక్స (PVR INOX) కు వెళ్ళారు. అయితే సినిమా ప్రారంభానికి ముందు అరగంట సేపు యాడ్స్, సినిమిల ట్రైలర్లు వేశారు. దీంతో విసుగుచెందిన అతను నా టైమ్ వేస్ట్ అయిందంటూ వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. తన టైమ్ 25 నిమిషాలు వృధా అయిందని సదరు వ్యక్తి పీవీఆర్ ఐనాక్స్ మీద దావా వేశారు. అక్కడ వేసిన ప్రకటనల వలన సాయంత్రం ఆరుగంటలు మొదలవ్వాల్సిన షో 6.30 గంటలకు అయింది. దీని కారణగా తన షెడ్యూళ్ళను క్యాన్సిల్ చేసుకోవలసి వచ్చిందని చెప్పారు. ఆ యాడ్స్ వలన ప్రేక్షకులకు ఎటువంటి ఉపయోగం ఉండదని ఆయన దావాలో పేర్కొన్నారు.
Also Read : నా సోదరుడు, మరదలు అప్పులు తెచ్చారు.. నేనిక తీర్చలేను: ఆన్లైన్ బెట్టింగ్కు ముగ్గురు బలి!
Also Read : AP New VCs Appointment: ఏపీలో వీసీల నియామకం.. యూనివర్సిటీల వారీగా లిస్ట్ ఇదే!
సమయాన్ని డబ్బుగా పరిగణించాలి..
ఈ కేసును ఇప్పుడు వినియోగదారుల కమిషన్ విచారించి తీర్పును ఇచ్చింది. దావా వేసిన వ్యక్తి అడిగినదానిలో న్యాయం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. టైమ్ ను డబ్బుగా పరిగణించి...సదరు వ్యక్తికి నష్ట పరిహారం కింద రూ. 65 వేలు చెల్లించాలని పీవీఆర్ ఐనాక్స్ ను ఆదేశించింది. దాంతో పాటూ రూ.లక్ష జరిమానా కూడా విధించింది. అయితే ఇందులో బుక్ మై షోకు ఎటువంటి సంబంధం లేదని కోర్టు చెప్పింది. బుకింగ్ ప్లాట్ఫామ్ కాబట్టి యాడ్స్ స్ట్రీమింగ్ మీద దానికి ఎలాంటి సబంధం లేదని తేల్చింది. కాబట్టి బుక్ మై షో ఎటువంటి డబ్బూ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పింది.
Also Read: Supreme Court: భారత్ లో యూట్యూబ్ కు కళ్ళెం..సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
Also Read : Peas Peel Benefits: బఠానీ తొక్కలు పారవేసే ముందు అద్భుత ప్రయోజనాలను తెలుసుకోండి