/rtv/media/media_files/2025/05/12/mfefgIBaZvs1pW6PfKKa.jpg)
Air Marshal denies rumours of action at Pakistan's Kirana Hills Nuclear Sites
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ భారత్పై డ్రోన్లు, మిసైళ్లు, ఫైటర్ జెట్లతో దాడులకు యత్నించిన సంగతి తెలిసిందే. కానీ వాటిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. అలాగే పాక్లోని పలు మిలటరీ ఎయిర్బేస్లను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. అయితే పాక్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న కిరానా హిల్స్లో కూడా భారత్ దాడులు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే అక్కడ న్యూక్లియర్ స్థావరాలు కూడా ఉన్నాయని.. వాటిని కూడా భారత్ ధ్వంసం చేసిందనే ప్రచారం నడిచింది. అయితే దీనిపై మీడియా సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఎయిర్ మార్షల్ ఏకే భారతి మాట్లాడారు.
Also Read: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. 17 మంది ఆడశిశువులకు సిందూర్ పేరు
Also Read : విరాట్ కోహ్లీ సంపద తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ఇన్ని కోట్లా భయ్యా!
Kirana Hills Nuclear Sites
'' కియారా హిల్స్లో ఉన్న ఇళ్లు న్యూక్లియర్ స్థావరాలు ఉన్నాయని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. అక్కడ ఏముందో దాని గురించి మాకు తెలియదు. మేము కియాలా హిల్స్పై దాడులు చేయలేదు. నిన్న జరిగిన ప్రెస్మీట్లో కూడా ఇది చెప్పలేను.. ఈరోజు కూడా ప్రస్తవించలేదని'' అన్నారు.మరోవైపు పాకిస్థాన్ అధికారులు మాత్రం కేవలం ఖాళీగా ఉన్న హిల్సైడ్ స్థలాల్లో మాత్రమే దాడులు జరిగాయని చెప్పారు. అంతేకాదు భారత్ దాడులకు సంబంధించిన శాటిలైట్ ఇమెజెస్ కూడా వచ్చాయి.
"Thank you for telling us, that Kirana Hills houses some nuclear installations. We did not know about it. We did not hit Kirana hills, whatever is there...", Air Marshal AK Bharti
— Sidhant Sibal (@sidhant) May 12, 2025
On if India hit near Pak nuclear sites pic.twitter.com/9MXaMBqUuy
Also Read: పాక్ను గాల్లోనే అబ్బ అనిపించాం.. వీడియోలు రిలీజ్ చేసిన ఇండియన్ ఆర్మీ!
దాదాపు 8 ప్రాంతాల్లో పాకిస్థాన్కు చెందిన రాడార్ ఇన్స్టాలేషన్స్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్, మందుగుండు సామాగ్రిలు నిల్వ ఉన్న ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగాయి. శాటిలైట్ చిత్రాల్లో అవి ధ్వంసమైనట్లు కనిపించాయి. అయితే కియారా హిల్స్లోని పాక్కు చెందిన న్యూక్లియర్ స్థావరాలపై కూడా దాడులు జరిగినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా ఇండియన్ ఆర్మీ మేము అక్కడ దాడులు చేయలేదని క్లారిటీ ఇచ్చేసింది.
Also Read : మూడు పానీయాలు తాగితే కాలేయం కుళ్లిపోవడం ఖాయం..
national-news | Indian Army | telugu-news