/rtv/media/media_files/2025/05/12/3b8SKaUg2lSQFv4dsh29.jpg)
17 New Born Girls Named 'Sindoor' In UP After Indian Army's Operation Sindoor
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్పై భారత్ విజయవంతంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్, POKలోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు భారత సైన్యంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ సిందూర్ అనే పేరు చాలా పాపులర్ అయిపోయింది. ఈ తరుణంలో ఉత్తరప్రదేశ్లోని కుషినగర్ జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఇటీవల జన్మించిన 17 మంది ఆడ శిశువులకు అక్కడి తల్లిదండ్రులు సిందూర్ అని పేరు పెట్టారు.
Also Read: ఆపరేషన్ సింధూర్ మెరుపు దాడులు.. పాకిస్తాన్ ఆర్మీని ఎలా దెబ్బకొట్టాయంటే..?
Operation Sindoor Effect
ఇక వివరాల్లోకి వెళ్తే.. మే 10,11 తేదీల్లో కుషినగర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో 17 మంది ఆడ శిశువులు జన్మించారు. ప్రస్తుతం ఆపరేషన్ సిందూర్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. దీంతో ఆ శిశువుల తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ బిడ్డలను సిందూర్ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఆ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్కే షాహి వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై తాము గర్విస్తున్నామని ఆ చిన్నారుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
Also Read: ఆపరేషన్ సిందూర్.. మరో వీడియో రిలీజ్ చేసిన ఇండియన్ ఆర్మీ
అందుకే తమ కుమార్తెలకు సిందూర్ అనే పేరు పెట్టినట్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుషినగర్కు చెందిన అర్చన షాహి తన బిడ్డకు ఈ పేరు పెట్టడంపై మాట్లాడారు. తన కూతరు పెద్దయ్యాక ఆమెకు పెట్టిన పేరులో ఉన్న నిజాన్ని అర్థం చేసుకుంటుందని అన్నారు. తన కూతురు దేశం పట్ల విదేయత గల మహిళగా ఎదుగుతుందని భావిస్తున్నానని మరో మహిళ వ్యాసముని అన్నారు. సిందూర్ పేరు తన కూతురులో ధైర్యాన్ని నింపుతుందని ప్రియాంక దేవి ఆశాభావం వ్యక్తం చేశారు. యూపీతో పాటు బిహార్, సౌత్ రాష్ట్రాల్లో కూడా ఈ పేర్లు పెడుతున్నారు. ఒకవేళ మగపిల్లలు పుడితే కూడా వాళ్లకి సిందూర్ అనే పేర్లు నామకరణం చేస్తున్నారు.
Also Read: పాక్కు పక్కలో బల్లెంలా బలుచిస్తాన్.. వారి డిమాండ్లు ఏంటి? ఫుల్ హిస్టరీ ఇదే!
Also Read : భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు.. ఒక్కరోజులోనే ఎన్ని లక్షల కోట్లంటే?
telugu-news | rtv-news | national-news