/rtv/media/media_files/2025/06/15/4r4FnkS5KpvN0o6CzJb1.jpg)
Ahmedabad plane crash, DNA tests identify 47 victims; 24 bodies handed over to kin
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వాళ్లని గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రక్రియ గత మూడు రోజులుగా సాగుతోంది. ఇప్పటిదాకా మొత్తం 47 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీళ్లలో 24 మృతదేహాలను వాళ్ల కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. మృతుల్లో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినవాళ్లే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.
Also Read: ఎంత మూర్కుడివిరా నీవు....భార్యను బాల్కనీ రెయిలింగ్కు వేలాడదీసిన భర్త
విమాన ప్రమాదంలో మొత్తం 241 మంది చనిపోగా.. ఒక్కరు మాత్రమే బతికారు. విమానం బీజే వైద్య కళాశాలపై కూలడంతో అందులో ఉన్న 29 వైద్య విద్యార్థులు, స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. చాలావరకు మృతదేహాలు అసలు గుర్తుపట్టలేకుండా కాలిపోయాయి. అందుకే డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నారు. ఈ ప్రక్రియకు సమయం పడుతుండటంతో బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే విమాన ప్రమాద స్థలాన్ని ప్రధాని మోదీ పరిశీలించిన సంగతి తెలిసిందే.
Also Read: 23 ఏళ్ల తర్వాత సైప్రస్లో అడుగుపెట్టిన భారత ప్రధాని
ఇదిలాఉండగా ఇటీవల అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి ఎయిరిండియా ఫ్లైట్ లండన్కు బయలుదేరింది. విమానం రన్వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మేఘాని నగర్లో కుప్పకూలింది. ఈ విమానం బీజే మెడికల్ కాలేజీపై కూలడంతో అందులో ఉన్న పలువురు వైద్య విద్యార్థులు, వైద్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మొత్తం 270 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఈ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read: మనాలి జిప్ లైన్ అడ్వెంచర్ లో విషాదం.. 30 అడుగుల లోయలో పడ్డ బాలిక...ఆ తర్వాత