/rtv/media/media_files/2025/06/15/Pvv0MU944UWXr6olSssl.jpg)
Tragedy in Manali zip line adventure
Manali Adventure:
హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో జిప్లైన్ ప్రమాదంలో ఒక బాలిక తీవ్రంగా గాయపడింది. నాగపూర్కు చెందిన ఓ కుటుంబం వేసవి సెలవుల సందర్భంగా మనాలికి విహారయాత్రకు వెళ్లింది. నాగపూర్ కు చెందిన ప్రపుల్ల బిజ్వే, అతనిభార్యతో పాటు కూతురు పదేళ్ల త్రిష బిజ్వేలు మనాలికి పిక్నిక్కు వచ్చారు. ఈ నెల 8న జిప్లైన్ కేబుల్ ద్వారా త్రిష ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించింది. జిప్లైన్ కేబుల్ ఎక్కిన త్రిష ఒకవైపు నుంచి మరో వైపుకు వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే త్రిష మధ్యలోకి రాగానే జిప్లైన్ ఊడిపోయింది. దీంతో ఆమె సుమారు 30 అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోయింది. దీంతో త్రిష తీవ్రంగా గాయపడింది. ఆమెకాలులో పగుళ్లు ఏర్పడినట్లు తెలుస్తోంది. కాగా త్రిష జిప్ లైన్ ఎక్కిన వీడియో ఇపుడు వెలుగులోకి వచ్చింది. జిప్లైన్ ఊడిపోవడంతోనే త్రిష కిందపడిపోయినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read: భార్యపై ఇంత ప్రేమ.. ఏకంగా మరో ‘తాజ్ మహల్’ను కట్టించిన భర్త - వీడియో చూశారా?
This is why adventure sports aren’t safe in India. In Manali, a young girl fell from a zipline—nearly 30 feet—and is now seriously injured. Anyone without proper experience starts these activities, and there’s no one to check. Action is only taken after a fatal accident happens. pic.twitter.com/Xy5LNYRDwe
— Nikhil saini (@iNikhilsaini) June 15, 2025
Also Read: దుబాయ్లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం
త్రిషకు మొదట మనాలిలోని స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించారు, ఆపై తదుపరి చికిత్స కోసం చండీగఢ్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె నాగ్పూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది, వైద్యులు ఆమె పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. జిప్లైన్ స్థలంలో తగినంత భద్రతా చర్యలు లేవని, సంఘటన తర్వాత వారికి తక్షణ సహాయం అందించలేదని బిజ్వే కుటుంబం ఆరోపించింది. ప్రమాద తీవ్రతను, సరైన పర్యవేక్షణ లేదా అత్యవసర ప్రతిస్పందన లేకపోవడాన్ని నిరూపించడానికి వారు ప్రమాదానికి సంబంధించిన వీడియోను కూడా మీడియాకు చూపించారు. జిప్లైన్ ఆపరేటర్ల నుంచి ఈ ఘటనకు సంబంధించి సమాధానం కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు, అడ్వెంచర్ టూరిజం సైట్లలో మెరుగైన భద్రతా విధానాలను అమలు చేయాలని వారు కోరుతున్నారు. టూరిజం కోసం వస్తే ఇలా ప్రాణాలు పోగోట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎలా అని తీవ్రంగా ప్రశ్నించారు. ఈ విషయంపై దర్యాప్తు చేసి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కుటుంబం అధికారులను కోరింది.
Also read: మణిపూర్ వెపన్స్ ఆఫరేషన్..ఏకంగా 400 ఆయుధాలు స్వాధీనం
Also Read: ప్రతిరోజూ ఒక గ్లాసు బెల్లం పాలు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది?